తెలంగాణ : రైతులకు ప్రత్యేకంగా, నాణ్యమైన విద్యుత్తును నిరంతరాయంగా అందించాలనే లక్ష్యంతో తీసుకొస్తున్న ‘రైతు డిస్కం’ (TGRPDCL) ఏర్పాటుకు తెలంగాణ ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ మేరకు TGRPDCLకు రాష్ట్ర విద్యుత్ నియంత్రణ మండలి లైసెన్స్ జారి చేసింది. నాలుగు నెలల్లో డిస్కం కార్యకలాపాలు ప్రారంభమవుతాయని తెలిపింది. అలాగే రైతులకు ఉచిత విద్యుత్ కొనసాగుతుందని ERC ప్రకటించింది. మోటర్లకు మీటర్లు పెట్టేది లేదని స్పష్టం చేసింది.
Save or share this story as a newspaper-style Epaper Clip:
