Tnrnews.in Telugu News App | Daily Telugu News Channel In Suryapeta Telangana
తెలంగాణ

మొల్లమాంబ విగ్రహ దిమ్మెను పునః ప్రతిష్ఠించాలి అణ గారిన కుమ్మరులకు అవమానం

మొల్ల మాంబ విగ్రహ దిమ్మెను కూల్చడం హేయమైన చర్య అని కుమ్మరి సంఘం నాయకులు మామిడి రామారావు, చలిగంటి రామారావులు అన్నారు. శనివారం పట్టణంలోని పబ్లిక్ క్లబ్ లో విలేకరుల సమావేశంలో వారు మాట్లాడారు. కుమ్మర్లను ఆర్థికంగా, రాజకీయంగా, వృత్తిపరంగా అనేక విధాలుగా వేలుగులోకి రాకుండా చూస్తున్నారని ఘాటుగా విమర్శించారు. ప్రస్తుతం వృత్తి కనబడకుండా పోయింది. వారి ఉనికి కోసం ఆయా గ్రామాలలో పట్టణాలలో మొల్లమాంబ విగ్రహాలు ఏర్పాటు చేసుకుందామని అనుకున్న వాటి దిమ్మలను కూడా తొలగించేసి తొక్కి పారేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.

 

నల్గొండ జిల్లా నాగార్జున సాగర్ నియోజకవర్గం హాలియ మండల కేంద్రంలో తొలి తెలుగు మహిళా కవయిత్రి మొల్లమాంబ విగ్రహ ఏర్పటు చేయుటకు నిర్మించిన దిమ్మెను మున్సిపల్ అధికారులు కుల్చివేయడం హేయ మైనా చార్య ఒక వైపు బీసీ కులగణన పేరుతో ప్రభుత్వం బీసీల మీద ప్రేమ చూపిస్తూ నటిస్తూ మరో వర్గం బీసీ లను అనగ దొక్కే విదంగా ఇలా చేయటం సరియైనది కాదు అని దిమ్మే కుల్చే విషయంలో పాల్గొన్న అధికారులను వెంటనే సస్పెండ్ చేస్తు చర్యలు తీసుకోవాలని లేకపోతే ఈ ప్రభుత్వం బీసీల వ్యతిరేకిగా ముద్ర వేయించుకుంటుందని తెలిపారు. కుమ్మర్లను తొక్కాలని చూస్తే సంఘటితమై వ్యతిరేక పోరాటాలు చేయాల్సి వస్తుందని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో రామారావు, చలిగంటి ప్రసాద్, చలిగంటి దామోదర్, చలిగంటి వెంకట్ నరసయ్య, గుడిమెట్ల రామకృష్ణ, సలిగంటి నాగరాజు, కొలుచలం నరేష్, చలిగంటి రంగా, పొనుగోటీ శివ, అఖిల్ పలువురు కుమ్మరులు పాల్గొన్నారు.

Related posts

అర్హత ఉన్న చివరి వ్యక్తి వరకూ ప్రభుత్వ పథకాలు: మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి

TNR NEWS

ఇందిరా అనాధాశ్రమం కు ప్రభుత్వం సహకారం అందించాలి

Harish Hs

నియామకపు ఉత్తర్వులకు తరలి వెళ్లిన జీపీఓలు

TNR NEWS

జగన్నాధపురం ప్రాథమికోన్నత పాఠశాలను తనిఖీ చేసిన ఎంఈఓ

TNR NEWS

అర్హులకు పథకాలు అందేలా సర్వే చేయాలి  అడిషనల్ కలెక్టర్ బి ఎస్ లత 

TNR NEWS

*అకాల వర్షంతో తడిసిన ధాన్యాన్ని ప్రభుత్వం వెంటనే కొనుగోలు చేసి రైతులను ఆదుకోవాలి.*   *సిపిఎం జిల్లా కార్యదర్శి మల్లు నాగార్జున రెడ్డి* 

TNR NEWS