Tnrnews.in Telugu News App | Daily Telugu News Channel In Suryapeta Telangana
ఆంధ్రప్రదేశ్

మెడికల్ విద్యార్థినులకు శశిధర్ ఆర్థిక చేయూత

పిఠాపురం : జనసేన ఎన్.అర్.ఐ. సమన్వయకర్త కొలికొండ శశిధర్ యాదవ్ పిఠాపురం నియోజకవర్గంకు చెందిన మెడికల్ విద్యార్థినులు ఎర్రవరపు మౌనిక, రాయి శ్యామాలాకు చెరొక లక్షల రూపాయలు చొప్పున ఆర్థిక చేయూత అందజేశారు. విద్యలో గోల్డ్ మెడల్ సాధించిన విద్యార్థినుల కుటుంబం చేతి వృత్తిపై ఆధారపడి కళాశాల ఫీజు చెల్లించలేని స్థితిలో ఉన్నారని, స్థానిక నాయకులు తమను సంప్రదించిన నేపథ్యంలో ఈ సహాయం చేస్తున్నట్లు ఆయన తెలిపారు. పిఠాపురం నియోజకవర్గం ఇన్చార్జి మర్రెడ్డి శ్రీనివాస్ చేతుల మీదుగా ఈ చెక్ అందజేశారు. శుక్రవారం మంగళగిరి జనసేన కేంద్ర కార్యాలయంలో జరిగిన ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు చెల్లుబోయిన సతీష్ కుమార్, తెలగంశెట్టి వేంకటేశ్వర రావు, చెల్లుబోయిన నాగేశ్వర రావు తదితరులు పాల్గొన్నారు.

Related posts

బహుముఖ ప్రజ్ఞాశాలి ఉమర్ ఆలీషా

నాగార్జున సాగర్ నుండి శ్రీశైలం వరకు లాంచ్ ప్రయాణాన్ని ప్రారంభించిన తెలంగాణ పర్యాటకశాఖ…..

Harish Hs

ఆవిర్భావ సభ అనంతరం ప్రాంగణం, పరిసరాలు శుభ్రం చేసే బాధ్యత తీసుకొంటున్నాము

Dr Suneelkumar Yandra

సూపర్ సిక్స్ పథకాలకు పంగనామాలు పెట్టారు అంటూ షర్మిల ధ్వజమెత్తారు

TNR NEWS

శ్రీ దుర్గ ట్రేడ్ ఫెయిర్ ఎగ్జిబిషన్ ప్రారంభించిన మర్రెడ్డి

Dr Suneelkumar Yandra

రోలుగుంట మండలం రాజన్నపేట క్వారీ పై అధికారుల విచారణ

Dr Suneelkumar Yandra