Tnrnews.in Telugu News App | Daily Telugu News Channel In Suryapeta Telangana
ఆంధ్రప్రదేశ్

మెడికల్ విద్యార్థినులకు శశిధర్ ఆర్థిక చేయూత

పిఠాపురం : జనసేన ఎన్.అర్.ఐ. సమన్వయకర్త కొలికొండ శశిధర్ యాదవ్ పిఠాపురం నియోజకవర్గంకు చెందిన మెడికల్ విద్యార్థినులు ఎర్రవరపు మౌనిక, రాయి శ్యామాలాకు చెరొక లక్షల రూపాయలు చొప్పున ఆర్థిక చేయూత అందజేశారు. విద్యలో గోల్డ్ మెడల్ సాధించిన విద్యార్థినుల కుటుంబం చేతి వృత్తిపై ఆధారపడి కళాశాల ఫీజు చెల్లించలేని స్థితిలో ఉన్నారని, స్థానిక నాయకులు తమను సంప్రదించిన నేపథ్యంలో ఈ సహాయం చేస్తున్నట్లు ఆయన తెలిపారు. పిఠాపురం నియోజకవర్గం ఇన్చార్జి మర్రెడ్డి శ్రీనివాస్ చేతుల మీదుగా ఈ చెక్ అందజేశారు. శుక్రవారం మంగళగిరి జనసేన కేంద్ర కార్యాలయంలో జరిగిన ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు చెల్లుబోయిన సతీష్ కుమార్, తెలగంశెట్టి వేంకటేశ్వర రావు, చెల్లుబోయిన నాగేశ్వర రావు తదితరులు పాల్గొన్నారు.

Related posts

పిఠాపురంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు

అన్నవరం అన్నప్రసాద నిర్వహణలో బఫే అభినందనీయం – స్వయంభూ భోగిగణపతి పీఠం

Dr Suneelkumar Yandra

పాదగయను దర్శించిన జియో సిఈఓ

Dr Suneelkumar Yandra

రేపు ఎమ్మెల్సీ అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేయనున్న కె.నాగబాబు

జనసేన ఆవిర్భావ సభ వేదిక నిర్మాణానికి భూమి పూజ

ప్రభుత్వాసుపత్రిని కాకినాడ జిల్లాకు పరిమితం చేయాలి