Tnrnews.in Telugu News App | Daily Telugu News Channel In Suryapeta Telangana
ఆంధ్రప్రదేశ్

భక్తి శ్రద్ధలతో శ్రీ షిరిడీ సాయిబాబా వారి 19వ ఆలయ వార్షికోత్సవం

మూలస్థాన అగ్రహారం (ఆలమూరు) : ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా కొత్తపేట నియోజకవర్గం ఆలమూరు మండలం మూలస్థానం అగ్రహారం గౌతమీ గోదావరి తీరాన కొలువైయున్న శ్రీ షిరిడీ సాయిబాబా వారి 19వ ఆలయ వార్షికోత్సవం ఆలయ కమిటీ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. 108 మంది కన్యలతో గౌతమి గోదావరి నుండి తీసుకొచ్చిన జలాలతో పాటు బాబాను ముత్యాల పల్లకిలో గ్రామోత్సవం నిర్వహించి గోదావరి జలాలతో పాటు 40 రకాల పండ్ల రసాలతో ఆలయంలో కొలువైన బాబాకు అభిషేకం, కలశ పూజ నిర్వహించి టన్నున్నర వివిధ రకాల పూలతో ప్రత్యేక అలంకరణ చేశారు. ఉదయం నుండి రావులపాలెం, మండపేట, కడియం, ఆలమూరు మండలాలతో పాటు జిల్లా నలుమూలల నుండి బాబాను భక్తులు దర్శించుకున్నారు. అలాగే ఆలయ కమిటీ ఆధ్వర్యంలో భారీ అన్నదానం నిర్వహించారు.

Related posts

సత్యవేడు నియోజకవర్గ సమన్వయకర్త డాక్టర్ శ్రీపతి

TNR NEWS

స్మార్ట్ సిటీ సమ్మర్ స్టోరేజ్ అవసరాలు తీర్చాలి – పౌరసంక్షేమసంఘం డిమాండ్

Dr Suneelkumar Yandra

సంక్షేమం, అభివృద్ధికి ప్రాధాన్యత ఇచ్చేలా బడ్జెట్ రూపొందించామన్న చంద్రబాబు

TNR NEWS

లక్ష తెల్లజిల్లేడు పువ్వులతో ఉచ్ఛిష్ట గణపతికి చతుర్థి నీరాజనం

Dr Suneelkumar Yandra

వేసవి ఎండల్లో కిలో వాట్స్ విద్యుత్ భారాలు తగవు – పౌర సంక్షేమ సంఘం డిమాండ్

పిఠా‘‘పుర’’ంలో ఎన్నికల కోడ్‌ వర్తించదా…!? – చూసి చూడనట్టు వ్యవహరిస్తున్న అధికారులు

Dr Suneelkumar Yandra