Tnrnews.in Telugu News App | Daily Telugu News Channel In Suryapeta Telangana
ఆంధ్రప్రదేశ్

ఆరోగ్య భీమా ప్రీమియంపై జిఎస్టి భారం తగ్గించాలి – పౌర సంక్షేమ సంఘం డిమాండ్

కాకినాడ : ఆరోగ్య భీమా ప్రీమియం సామాన్యుడికి మధ్య తరగతికి అందనంత ఖరీదైన ప్రక్రియగా మారుతున్నదని పౌర సంక్షేమ సంఘం పేర్కొంది. వైద్య చికిత్స భారం కావడం వలన ఆరోగ్య భీమా ప్రీమియం 15 నుండి 20 శాతం పెరుగుతుండడం వలన ఆందోళన చెందుతున్న ప్రభావం ఏర్పడిందన్నారు. భీమాపై 18శాతం జిఎస్టి వస్తు సేవల పన్ను విధించడం వలన పాలసీదారులకు ఉపశమనం దక్కడంలేదన్నారు. కొందరు వీటిని భరించలేక పాలసీలను వదిలేస్తున్న దుస్థితి వుందన్నారు. తీవ్ర భారం కావడం వలన ప్రయివేటు సంస్థల్లోని ఉద్యోగులు స్వంతంగా పాలసీ తీసుకునే అవకాశం చేయకపోవడంతో ఉద్యోగం కోల్పోయిన సందర్భాల్లో భీమా రక్షణ దక్కడం లేదన్నారు. భీమా పాలసీ చేసిన ఉద్యోగుల పదవీ విరమణ వయస్సు పెరిగే కొద్దీ ప్రీమియం రేటు పెరగడం వలన జీవన పొదుపు చేసుకోలేని ఇబ్బందులు ఎదుర్కొంటున్నారన్నారు. జిఎస్టి భారాన్ని 5 శాతం మించకుండా విధించే ప్రక్రియను ప్రభుత్వం వహించాలని పౌర సంఘం కన్వీనర్ సామాజిక వేత్త దూసర్లపూడి రమణరాజు డిమాండ్ చేశారు. లేకుంటే ఆరోగ్య భీమా అన్ని వర్గాలకు అందని వైద్యంగా వుంటుందన్నారు.

Related posts

గెలుపే లక్ష్యంగా పనిచేయాలి.

TNR NEWS

పోలీసుల సంక్షేమానికి ఏడాదికి రూ. 20 కోట్లు చొప్పున ఇస్తాం*

TNR NEWS

శివుడు ఎలా పుట్టాడో తెలుసా? శివుని జననం మరియు అవతారం యొక్క ఉత్తేజకరమైన కథ ఇక్కడ ఉంది.!!

Dr Suneelkumar Yandra

ధ్వజస్తంభం స్ధాపన కార్యక్రమంలో పాల్గొన జిల్లా జనసేన కార్యదర్శి జ్యోతుల శ్రీనివాసు

దక్షిణమధ్య రైల్వే జిఎంకు పౌరసంక్షేమసంఘం వినతి

Dr Suneelkumar Yandra

గత ప్రభుత్వంలో ఇళ్ళులేని పేదలకు ఇళ్ల పట్టాలిచ్చి స్థలం చూపించలేదు

Reporter James Chinna