Tnrnews.in
ఆంధ్రప్రదేశ్

ప్రభుత్వ ఉద్యోగుల భార్యలకే కుట్టు మిషన్ల పంపిణీనా..!?

పిఠాపురం : నేడు జరగబోయే పిఠాపురం ఎమ్మెల్యే, రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి కొణిదల పవన్ కళ్యాణ్ పర్యటనలో భాగంగా పలు కార్యక్రమాలకు నియోజకవర్గ పరిధిలో శంకుస్థాపనలు చేయనున్నారు. అందులో భాగంగానే స్థానిక రథాల పేట సెంటర్ వద్ద ఉన్న అంబేద్కర్ భవన్లో ఇప్పటిదాకా మహిళలకు కుట్టు మిషన్లు శిక్షణ ఇచ్చి నేడు పవన్ కళ్యాణ్ రాకతో ఆయన చేతుల మీదుగా ఉచితంగా కుట్టుమిషన్లు పంపిణీ కార్యక్రమం చేయనున్నారు. ఇందులో ప్రభుత్వ ఉద్యోగుల భార్యలు కుట్టుమిషన్లు అందుకునే వారిలో ఉన్నట్టు, ఇప్పటికే వారి యొక్క పేర్లతో నమోదైన లిస్టు ప్రిపేర్ చేయడం జరిగిందని తెలిసింది. ప్రభుత్వ పథకాలు కేవలం ప్రభుత్వ అధికారుల లేక ప్రభుత్వ ఉద్యోగ కుటుంబాలకే పరిమితమా అన్న ప్రశ్న పిఠాపురం నియోజకవర్గంలో చక్కర్లై కొడుతుంది. పిఠాపురం నియోజకవర్గం దేశవ్యాప్తంగా మోడల్ నియోజకవర్గంగా తీర్చిదిద్దుతా అన్న పవన్ వ్యాఖ్యలు కేవలం ప్రభుత్వ ఉద్యోగుల భార్యలకే సొంతం కావడం హాస్యాస్పదం. దీనిపై ప్రత్యేక కమిటీని నియమించి అధికారులు సక్రమంగా పనిచేసి లబ్ధిదారులకు మాత్రమే పథకాలు అందే విధంగా కృషి చేయాలని నియోజకవర్గ శ్రేయోభిలాషులు అభిలాషిస్తున్నారు.

Save or share this story as a newspaper-style Epaper Clip:

Related posts

పిఠా‘‘పుర’’ంలో ఎన్నికల కోడ్‌ వర్తించదా…!? – చూసి చూడనట్టు వ్యవహరిస్తున్న అధికారులు

Dr Suneelkumar Yandra

మోడే శ్రీనివాస్ కుటుంబానికి నిత్యవసర సరుకులు పంపిణీ

Dr Suneelkumar Yandra

ప్రారంభమైన ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ ప్రక్రియ

Dr Suneelkumar Yandra

భక్తులతో కిటకిటలాడుతున్న శైవ క్షేత్రాలు..

TNR NEWS

జామియా మసీదు వద్ద జీబ్రా క్రాసింగ్ ఏర్పాటు పూర్తి చేయాలి – సిఎం హామీ పూర్తి చేయాలి

Dr Suneelkumar Yandra

మట్టి విగ్రహాలు పంపిణీ చేసిన ఆదర్శ్ కళాశాల

Dr Suneelkumar Yandra