Tnrnews.in Telugu News App | Daily Telugu News Channel In Suryapeta Telangana
తెలంగాణ

పహల్గాం లో ఉగ్రదాడి అమానుషం

జమ్మూ కాశ్మీర్ పహల్గాం లో పర్యాటకులపై ఉగ్రవాదులు జరిపిన దాడికి నిరసనగా కోదాడ పట్టణంలో ఇండియన్ వెటరన్ ఆర్గనైజేషన్ (ఐవివో) ఆధ్వర్యంలో నిరసన తెలిపారు. గురువారం పట్టణంలోని ప్రధాన రహదారిపై కొవ్వొత్తులు వెలిగించి శాంతియుతంగా ర్యాలీ తీసి అమరులైన భారత పౌరుల ఆత్మకు శాంతి చేకూరాలని నివాళులు అర్పించారు. అనంతరం ఉగ్రవాదం, మతోన్మాదం నశించాలి అంటూ నినాదాలు చేశారు. కోదాడ డిఎస్పి శ్రీధర్ రెడ్డి పాల్గొని మాట్లాడారు. పహల్గాం లో సామాన్య ప్రజలపై ఉగ్రవాదులు జరిపిన దాడి అమానుషం అన్నారు. దేశ ప్రజలందరూ కుల మతాలకు అతీతంగా ముక్తకంఠంతో ఖండించాలన్నారు. ఈ కార్యక్రమంలో ఇండియన్ వెటరన్ ఆర్గనైజేషన్ సూర్యపేట జిల్లా అధ్యక్షులు డాక్టర్ గుండా మధుసూదన్ రావు, పి ఆర్ ఓ ఎస్ రమేష్, పాట్రన్స్ గుండపునేని నాగేశ్వరరావు, జగనీ ప్రసాద్, సెక్రటరీ ఉపేందర్, ట్రెజరర్ కె వెంకన్న, రహీం, గుండెపంగు రమేష్, హిందువులు, ముస్లిం సోదరులు పట్టణ ప్రజలు తదితరులు పాల్గొన్నారు……….

Related posts

కానిస్టేబుల్ నరేష్ పై దాడి చేసిన వారిని‌ శిక్షించాలి

Harish Hs

అల్మాయిపేట మంజీర నదిలో ప్రత్యక్షమైన మొసలి రెండు రోజుల ముందు అందోలు వద్ద కలకలం అప్రమత్తంగా ఉండాలంటున్న స్థానికులు

TNR NEWS

కోదాడ షీ టీం ఎస్సైగా మల్లేష్ బాధ్యతలు స్వీకరణ

TNR NEWS

సుప్రీంకోర్టు తీర్పును వెంటనే అమలు చేయాలి  ఎస్సీ వర్గీకరణ కమిషన్ చైర్మన్ షమీం అక్తర్ కు వినతిపత్రం అందజేత

TNR NEWS

ప్రతి ఒక్కరూ ఆధ్యాత్మిక చింతన కలిగి ఉండాలి  కార్తీక మాసం ఆధ్యాత్మికతకు ప్రతీక  శివుని అనుగ్రహంతో కోదాడ పట్టణ ప్రజలు సుభిక్షంగా ఉండాలి

TNR NEWS

కోదాడ పట్టణంలో ఘనంగా బోనాల పండుగ

Harish Hs