Tnrnews.in Telugu News App | Daily Telugu News Channel In Suryapeta Telangana
తెలంగాణ

పహల్గాం లో ఉగ్రదాడి అమానుషం

జమ్మూ కాశ్మీర్ పహల్గాం లో పర్యాటకులపై ఉగ్రవాదులు జరిపిన దాడికి నిరసనగా కోదాడ పట్టణంలో ఇండియన్ వెటరన్ ఆర్గనైజేషన్ (ఐవివో) ఆధ్వర్యంలో నిరసన తెలిపారు. గురువారం పట్టణంలోని ప్రధాన రహదారిపై కొవ్వొత్తులు వెలిగించి శాంతియుతంగా ర్యాలీ తీసి అమరులైన భారత పౌరుల ఆత్మకు శాంతి చేకూరాలని నివాళులు అర్పించారు. అనంతరం ఉగ్రవాదం, మతోన్మాదం నశించాలి అంటూ నినాదాలు చేశారు. కోదాడ డిఎస్పి శ్రీధర్ రెడ్డి పాల్గొని మాట్లాడారు. పహల్గాం లో సామాన్య ప్రజలపై ఉగ్రవాదులు జరిపిన దాడి అమానుషం అన్నారు. దేశ ప్రజలందరూ కుల మతాలకు అతీతంగా ముక్తకంఠంతో ఖండించాలన్నారు. ఈ కార్యక్రమంలో ఇండియన్ వెటరన్ ఆర్గనైజేషన్ సూర్యపేట జిల్లా అధ్యక్షులు డాక్టర్ గుండా మధుసూదన్ రావు, పి ఆర్ ఓ ఎస్ రమేష్, పాట్రన్స్ గుండపునేని నాగేశ్వరరావు, జగనీ ప్రసాద్, సెక్రటరీ ఉపేందర్, ట్రెజరర్ కె వెంకన్న, రహీం, గుండెపంగు రమేష్, హిందువులు, ముస్లిం సోదరులు పట్టణ ప్రజలు తదితరులు పాల్గొన్నారు……….

Related posts

మృతుడి కుటుంబాన్ని పరామర్శించిన మాజీ ఎమ్మెల్యే

TNR NEWS

లిఫ్ట్ ఇస్తే బైక్ ఎత్తుకెళ్లిన దొంగ

TNR NEWS

సాయి గ్రామర్ పాఠశాలలో ఘనంగా 194 వ సావిత్రిబాయి పూలే జన్మదినవేడుకలు

TNR NEWS

గ్రూప్ III పరీక్షా కేంద్రాలను పరిశీలించిన ఎస్పి సన్ ప్రీత్ సింగ్ ఐపీఎస్

Harish Hs

*కాంగ్రెస్ పార్టీకి రాజీనామా బి ఆర్ ఎస్. పార్టీలో చేరిక*

TNR NEWS

ఆదివాసీ టీచర్స్ అసోసియేషన్స్ కాల సూచిక ఆవిష్కరణ… మండలం విద్యాధికారి సునీతా చేతుల మీదుగా

TNR NEWS