మహబూబాబాద్ జిల్లా, తొర్రూర్ మండలం అమ్మాపురం గ్రామ శివాలయంలో భక్తి శ్రద్దలతో కార్తీక్ పౌర్ణమి పూజలు చేశారు. ప్రజలు ఉదయాన్నే లేచి పూలు, పండ్లు, టెంకాయ, నైవేద్యం తో పరమ పవిత్రమైన ఈ కార్తీక పౌర్ణమి రోజు దీపాలు వెలిగించి తమ మొక్కులు తీర్చుకున్నారు. శివాలయం అర్చకులు అడ్లూరి సోమేశ్వర్ భక్తుల పేరుతో అర్చన చేసి వారికీ తీర్థ ప్రసాదాలు ఇవ్వడం జరిగింది.ఈ కార్తీక పౌర్ణమి పూజా కార్యక్రమం లో భక్తులు పెద్ద సంఖ్య లో పాల్గొన్నారు.
Save or share this story as a newspaper-style Epaper Clip:
