Tnrnews.in
తెలంగాణ

మొక్కలు నాటండి పర్యావరణాన్ని కాపాడండి

హైదరాబాద్ : మొక్కలు నాటండి పర్యావరణాన్ని కాపాడండి అని జీవనది ఫౌండేషన్ వ్యవస్థాపక అధ్యక్షురాలు ఇంటి లక్ష్మీ దుర్గ అన్నారు. శ్రీ విశ్వ విజ్ఞాన విద్య ఆధ్యాత్మిక పీఠం సప్తమి పీఠాధిపతి అవతారి శ్రీ హుస్సేన్షా 120వ జయంతి సందర్భంగా జీవనది ఫౌండేషన్ మరియు ఉమర్ ఆలీషా రూరల్ డెవలప్మెంట్ ట్రస్ట్ సంయుక్త ఆధ్వర్యంలో హైదరాబాద్ లో మొక్కలు నాటే కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా జీవనది ఫౌండేషన్ వ్యవస్థాపక అధ్యక్షురాలు ఇంటి లక్ష్మీ దుర్గ మాట్లాడుతూ ఉమర్ ఆలీషా రూరల్ డెవలప్మెంట్ ట్రస్ట్ వ్యవస్థాపకులు, శ్రీ విశ్వ విజ్ఞాన విద్య ఆధ్యాత్మిక పీఠం నవమ పీఠాధిపతి డాక్టర్ ఉమర్ ఆలీషా పిలుపు మేరకు “నా మొక్క – నా శ్వాస” కార్యక్రమం ద్వారా ప్రతి ఒక్కరూ మూడు మొక్కలు నాటి, వాటి సంరక్షణ చేపట్టాలని ఉమర్ ఆలీషా పిలుపునివ్వడం జరిగిందన్నారు. మొక్కలు నాటడం ద్వారా పర్యావరణాన్ని పరిరక్షించవచ్చని, మొక్కలు పెంచడం ద్వారా ప్రకృతి ఎంతో ఆహ్లాదకరంగా చక్కటి వాతావరణం ఏర్పడుతుందన్నారు. ఈ కార్యక్రమంలో జీవనది ఫౌండేషన్ సభ్యులు, మన్సురాబాద్ ప్రాథమిక పాఠశాల విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.

Save or share this story as a newspaper-style Epaper Clip:

Related posts

కరాటే పోటీల్లో బెజ్జంకి విద్యార్థుల ప్రతిభ

TNR NEWS

పంట నష్టపరిహారం కచ్చితంగా ఇవ్వాల్సిందే -కోదాడ మాజీ శాసనసభ్యులు బొల్లం మల్లయ్య యాదవ్ 

TNR NEWS

అడవి పంది దాడిలో ఒకరికి తీవ్ర గాయాలు…

TNR NEWS

వాసవి క్లబ్ కోదాడ ఆధ్వర్యంలో పలు సేవా కార్యక్రమాలు

Harish Hs

TNR NEWS

ఘనంగా భాషా పండితుల ఆత్మీయ సమ్మేళనం

Harish Hs