Tnrnews.in Telugu News App | Daily Telugu News Channel In Suryapeta Telangana
క్రీడా వార్తలుతెలంగాణ

విద్యార్థులు విద్యతో పాటు క్రీడాల్లో రాణించాలి ఎంపీడీవో సత్తయ్య

విద్యార్థులు విద్యతో పాటు క్రీడాల్లో రాణించాలని ఎంపీడీఓ సత్తయ్య, కంగ్టి ఎస్సై విజయ్ కుమార్ అన్నారు.శనివారం కంగ్టి మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో పదవ తరగతి విద్యార్థులకు కంగ్టి గ్రామపంచాయతీ తరపున వాలీబాల్,మరియు వాలీబాల్ నెట్ ను ఎంపీడీవో సత్తయ్య,ఎస్సై విజయ్ కుమార్ అందించారు. అనంతరం ఎంపీడీవో మాట్లాడుతూ…. విద్యార్థుల ప్రతిభను గుర్తించి క్రీడలను ప్రోత్సహించాలని అన్నారు. అలాగే పాఠశాలలో ఉపాధ్యాయులు విద్యార్థులకు క్రీడల గొప్పతనం గురించి చెప్పాలి అన్నారు. క్రీడల వలన మీఆరోగ్యం మంచిగా ఉంటుందని అన్నారు. ఆటలతో విద్యార్థుల జ్ఞాపక శక్తి పెరుగుతుందాని అన్నారు.విద్యార్థులకు విద్యతో పాటు క్రీడాలను కూడా ప్రోత్సహించాలని అన్నారు.విద్యార్థులు విద్యతో పాటు క్రీడల్లో రాణించిన ఉన్నంత శిఖరాలకు చేరాలని అన్నారు.ఈ కార్యక్రమంలో ఎంపీవో సుభాష్, ప్రధానోపాధ్యాయుడు యశ్వంత్, ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు.

Related posts

మహా మండల పూజలు విజయవంతం చేయాలి… ఆలయ కమిటీ ఉపాధ్యక్షులు బొలిశెట్టి కృష్ణయ్య

TNR NEWS

కాంట్రాక్ట్ ఉద్యోగుల రెగ్యులరైజేషన్‌పై హైకోర్టు కీలక తీర్పు

TNR NEWS

లింగ నిర్ధారణ పరీక్షలు భ్రూణ హత్యలు “ప్రైవేట్ హాస్పిటల్ దోపిడీ స్కానింగ్ సెంటర్ల దోపిడి పై చర్యలు తీసుకోవాలని”

TNR NEWS

TG UUEU రాష్ట్ర మహాసభలను జయప్రదం చేయండి

TNR NEWS

నేర నియంత్రణలో ప్రధాన పాత్ర సీసీ కెమెరాలదే

Harish Hs

జూలపల్లి లో ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారం నిర్వహించిన బిజెపి నాయకులు..

TNR NEWS