టి ఎన్ ఆర్ న్యూస్ రిపోర్టర్ హరీష్ కోదాడ
తమతో కలిసి చదువుకున్న బాల్య మిత్రుడు వంగవీటి రామారావు జిల్లా గ్రంథాలయ చైర్మన్ గా పదవి బాధ్యతలు చేపట్టడం తమకు ఎంతో సంతోషకరంగా ఉందని రామారావు తో కలిసి చదువుకున్న 1972-73 మిత్ర బృందం సభ్యులు అన్నారు. ఆదివారం కోదాడ పట్టణంలోని పబ్లిక్ క్లబ్ లో మిత్ర బృందం సభ్యులు రామారావును ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ నమ్మిన సిద్ధాంతం కొరకు ఒకటే పార్టీలో ఉంటూ ఎంతో కష్టపడి పనిచేశారని వారు భవిష్యత్తులో మరెన్నో ఉన్నతమైన పదవులను అందుకోవాలని ఆకాంక్షించారు. ఈ సందర్భంగా వంగవీటి రామారావు మాట్లాడుతూ తాను పార్టీకి చేసిన సేవలకు గాను గుర్తించి మంత్రి ఉత్తమ్,ఎమ్మెల్యే పద్మావతి రెడ్డిలు తనకు జిల్లా గ్రంథాలయ చైర్మన్ గా అవకాశం కల్పించినందుకు కృతజ్ఞతలు తెలిపారు. కోదాడ గ్రంధాలయ అభివృద్ధికి శక్తి వంచన లేకుండా తన వంతు కృషి చేస్తానని తెలిపారు. ఈ కార్యక్రమంలో మిత్ర బృందం సభ్యులు అనంత రాములు, వేనేపల్లి సత్యనారాయణ, బొడ్ల మదన్మోహన్ రావు,ఈశ్వర్ రావు, మూర్తి, సత్యనారాయణ, శివరామయ్య, నాగేశ్వరరావు, రామారావు తదితరులు పాల్గొన్నారు…………
Save or share this story as a newspaper-style Epaper Clip:
