పెద్దపల్లి జిల్లాలోని రాఘవపూర్ కన్నాల వద్ద జరుగుతున్న రైల్వే ట్రాక్ పునరుద్ధరణ పనులను *జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష* పరిశీలించారు.బుధవారం ఉదయం జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష పెద్దపల్లి మండలం రాఘవపూర్ కన్నాల రైల్వే ట్రాక్ వద్ద పట్టాలు తప్పిన గూడ్స్ రైలు ఘటనాస్థలానికి చేరుకొని అక్కడ జరుగుతున్న పునరుద్దరణ పనులను పరిశీలించారు.మంగళవారం రాత్రి 8.30 గంటలకు రాఘవపూర్ కన్నాల రైల్వే ట్రాక్ వద్ద గూడ్స్ రైలు పట్టాలు తప్పి ప్రమాదం జరిగిందని, ఈ సమాచారం అందుకున్న కలెక్టర్ వెంటనే ఘటనా స్థలానికి చేరుకొని బుధవారం తెల్లారుజామున వరకు ఉండి పోలీసు సిబ్బంది తో కలసి అవసరమైన చర్యలు చేపట్టారు. సింగరేణి సంస్థతో మాట్లాడి ఘటన స్థలానికి వెంటనే భారీ క్రేన్లు తీసుకుని వచ్చి పట్టాలు తప్పిన గూడ్స్ రైలును క్లియర్ చేసే పనులు ప్రారంభించారు.బుధవారం ఉదయం మళ్లీ ఘటన స్థలానికి వెళ్ళిన కలెక్టర్ అక్కడ జరుగుతున్న రైల్వే ట్రాక్ పునరుద్ధరణ పనులను ట్రాక్ పై ట్రాలి పై వెళ్లి పరిశీలించి,త్వరగా పూర్తయ్యేలా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ రైల్వే జీఎంను ఆదేశించారు.ఈ కార్యక్రమంలో పాలకుర్తి తహసిల్దార్ జ్యోతి, సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు.
Save or share this story as a newspaper-style Epaper Clip:
