May 8, 2026
Tnrnews.in Telugu News App | Daily Telugu News Channel In Suryapeta Telangana
క్రైమ్ వార్తలుతెలంగాణ

పోక్సో కేసులో వ్యక్తికి 20 ఏళ్ల జైలు శిక్ష

చేవెళ్ల :

పోక్సో కేసులో ఓ వ్యక్తికి రంగారెడ్డి జిల్లా ఎల్బీనగర్ పోక్స్ కోర్టు 20 సంవత్సరాల కఠిన కారాగార జైలు శిక్ష విధించిందని చేవెళ్ల సీఐ భూపాల్ శ్రీధర్ ప్రెస్ నోట్ ద్వారా వివరాలు వెల్లడించారు. వికారాబాద్ జిల్లా పూడూర్ మండలం బాకాపూర్ గ్రామానికి చెందిన వడ్డే ప్రకాష్ (27) తండ్రి అంజయ్య 2017 లో ఓ మైనర్ బాలికపై లైంగిక దాడికి పాల్పడినట్లు బుధవారం రంగారెడ్డి జిల్లా ఎల్బీనగర్ పోక్స్ కోర్టులో నేరం రుజువైంది. దీంతో అతడికి అతడికి 20 ఏళ్ల జైలు శిక్షతోపాటు రూ.25 వేల జరిమానా విధిస్తూ ఆ కోర్టు న్యాయమూర్తి హరీశ తీర్పునిచ్చినట్లు సీఐ భూపాల్ శ్రీధర్ తెలిపారు. ఈ కేసుకు స్పెషల్‌ పీపీలుగా కుమలత, నరేష్ , ఇన్వెస్టిగేషన్‌ ఆఫీసర్లుగా టీ స్వామి, శృతి కీర్తి, కోర్టు లైజన్‌ ఆఫీసర్‌గా బీ జంగయ్య, బ్రీఫింగ్ ఆఫీసర్లు గా యన్ పంకజ్ వసీ, బీ అలివేలు వసీ, చేవెళ్ల సీఐ భూపాల్ శ్రీధర్, పీసీలు ఆర్ దయాకర్ రెడ్డి, జీ విజయ్ కుమార్ పాల్గొన్నారు.

Related posts

ఇందిరమ్మ ఆత్మీయ భరోసా వ్యవసాయ కూలీలకు ఓ వరం

TNR NEWS

మిషన్ తో కట్ చేస్తున్న చెట్టు కొమ్మ మీద పడి వ్యక్తి మృతి

Harish Hs

డబ్బా పాలు వద్దు తల్లిపాలు ముద్దు

Harish Hs

పెంచిన వంట గ్యాస్ ధరలను తగ్గించాలి

Harish Hs

లోక్ అదాలత్ ను సద్వినియోగం చేసుకోండి రాజీ మార్గమే రాజమార్గం – ఎస్సై ప్రవీణ్ కుమార్

TNR NEWS

కోదాడలో ఘనంగా బక్రీద్ వేడుకలు

TNR NEWS