ఏసుక్రీస్తు జన్మ దినాన్ని పురస్కరించుకుని జరుపుకొనే క్రిస్మస్ పండుగ క్రైస్తవులకు పరమ పవిత్రమైనదని అన్నారు. క్రీస్తు బోధనలు ప్రతి ఒక్కరికీ ఆదర్శప్రాయమని తెలిపారు. ప్రేమను పంచడం, మంచి మనసుతో సేవ చేయడం ఎలాగో క్రీస్తు బోధనలు తెలిపాయని పేర్కొన్నారు. జిల్లా ప్రజలు పండుగను ఘనంగా జరుపుకోవాలని, జిల్లా ప్రజలందరూ సుఖశాంతులతో, ఆయురారోగ్యాలతో ఆనందంగా జీవించాలని, ప్రజలకు ఏసుక్రీస్తు చల్లని దీవెనలు ఎల్లప్పుడూ మెండుగా ఉండాలని కలెక్టర్ ఆకాంక్షించారు.
Save or share this story as a newspaper-style Epaper Clip:
