Tnrnews.in
తెలంగాణ

ఇందిరమ్మ ఇండ్ల ఎంపికలో భవన నిర్మాణ కార్మికులకు మొదటి ప్రాధాన్యత కల్పించాలి 

సిఐటియు భవన నిర్మాణ కార్మిక సంఘం మండల అధ్యక్షులు ఎస్.కె దస్తగిరి అన్నారు. బుధవారం మునగాల మండల కేంద్రంలోని సిఐటియు కార్యాలయంలో ఆ సంఘం సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ. అనేక నిర్మాణాలు గావిస్తున్న నిర్మాణరంగ కార్మికులకు సొంత గూడు లేక అనేక ఇబ్బందులు పడుతున్న పరిస్థితి మండలంలో ఉందని కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశపెడుతున్న ఇందిరమ్మ ఇండ్ల ఎంపికలో భవన నిర్మాణ కార్మికులకు మొదటి ప్రాధాన్యత ఇవ్వాలని ప్రభుత్వాన్ని కోరారు. అలాగే 60 సంవత్సరాలు నిండిన ప్రతి కార్మికునికి 6000 పెన్షన్ సదుపాయం కల్పించాలని గత ప్రభుత్వం ఇచ్చిన మోటార్ సైకిల్ హామీని ప్రస్తుత ప్రభుత్వం అమలు చేయాలని, వెల్ఫేర్ బోర్డులో ఉన్న పెండింగ్ క్లెయిమ్ లను తక్షణమే పరిష్కరించాలని, దళార్లు విచ్చలవిడిగా ఇప్పిస్తున్న వెల్ఫేర్ బోర్డు బోగస్ కార్డులను యుద్ధ ప్రాతిపదికన తొలగించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో భవన నిర్మాణ కార్మిక సంఘం మండల కార్యదర్శి నాగేంద్రబాబు టౌన్ అధ్యక్షుడు అల్లి నాగరాజు సహాయ కార్యదర్శి కోల ఆంజనేయులు సురభి రమేష్ ఎస్ కే జానీ పాషా కనకయ్య నరేష్ పుల్లారావు తదితరులు పాల్గొన్న.

Save or share this story as a newspaper-style Epaper Clip:

Related posts

సీనియర్ జర్నలిస్ట్ కి ఘన సన్మానం

TNR NEWS

విద్యార్థులు చదువుతోపాటు క్రీడల్లో రాణించాలి

Harish Hs

పర్యావరణ పరిరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యత : ఉదార్ట్ ఛైర్మన్ డాక్టర్ ఉమర్ ఆలీషా

TNR NEWS

రాష్ట్ర కార్యదర్శిగా కనెవేని శ్రీనివాస్

TNR NEWS

యూత్ కాంగ్రెస్, మండల అధ్యక్షులు తక్కెళ్లపాటి సాయి ఆధ్వర్యంలో ఉత్తమ్ కుమార్ రెడ్డి పద్మావతి రెడ్డి వివాహాది దినోత్సవ వేడుకలు

TNR NEWS

ఈ నెల 7 న రాష్ట్ర వ్యాప్తంగా జరుగు ఆటోల బంద్ ను జయప్రదం చేయండి

TNR NEWS