Tnrnews.in Telugu News App | Daily Telugu News Channel In Suryapeta Telangana
తెలంగాణ

సావిత్రి బాయి పూలే నేషనల్ ఐకాన్ అవార్డు అందుకున్న మల్యాల సతీష్ కుమార్ హైదరబాద్ రవీంద్ర భారతిలో అవార్డు ప్రధానం చేసిన అభిలాష హెల్పింగ్ హాండ్స్ ఆర్గనైజేషన్

మల్యాల మండల కేంద్రానికి చెందిన మల్యాల సతీష్ కుమార్ సావిత్రి బాయి పూలే జాతీయ ఐకాన్ అవార్డు అందుకున్నారు. సోమవారం హైదరాబాద్ రవీంద్ర భారతి ఆడిటోరియంలో అభిలాష హెల్పింగ్ హాండ్స్ ఆర్గనైజేషన్ వారిచే మహనీయురాలు సావిత్రి బాయిపూలే జయంతి మరియు ఆర్గనైజేషన్ 5వ వార్షికోత్సవాన్ని పురస్కరించుకొని రెండు తెలుగు రాష్ట్రాల్లో వివిధ రంగాలలో సేవలు అందిస్తున్న వారిని గుర్తించి అవార్డులు అందజేసి సత్కరించారు. అందులో భాగంగా కళాకారుడిగా, జర్నలిస్టుగా సమాజానికి సేవలు అందిస్తున్న మల్యాల సతీష్ కుమార్ కు జాతీయ ఐకాన్ అవార్డు అందజేశారు. ఈ సంధర్బంగా సతీష్ కుమార్ మాట్లాడుతూ.. మహోన్నత వ్యక్తి, సంఘ సంస్కర్త, మహనీయురాలు సావిత్రిబాయి పూలే  పేరిట అవార్డు అందుకోవడం నా అదృష్టంగా భావిస్తున్నా, నా సేవలు గుర్తించి నన్ను ఈ అవార్డుకు ఎంపిక చేసిన అభిలాష హెల్పింగ్ హాండ్స్ ఆర్గనైజేషన్ వ్యవస్థాపక అధ్యక్షురాలు డాక్టర్ ఎస్.సరోజనమ్మ , ఆర్గనైజేషన్ సభ్యులకు హృదయ పూర్వక ధన్యవాదాలు తెలిపినట్లు తెలిపారు.

Related posts

జనవరి నుంచే సన్నబియ్యం పథకం: మంత్రి ఉత్తమ్

Harish Hs

నార్త్ ఢిల్లీ కల్చరల్ అకాడమీ నేషనల్ అవార్డు- 2025 కి ఎంపిక

Harish Hs

తొర్రూర్ అయ్యప్ప స్వాముల అన్నదాన ప్రభు కార్యక్రమంలో పాల్గొన్న పాలకుర్తి ఎమ్మెల్యే 

TNR NEWS

ఘనంగా పూర్వ విద్యార్థుల సమ్మేళనం

Harish Hs

కులగణన సమగ్ర సర్వే 80 శాతం పూర్తి ఎంపీడీవో శ్రీనివాస్

TNR NEWS

భగవద్గీత పఠనంలో స్వర్ణ పతకం జయించిన లక్ష్మి తులసి

Harish Hs