వికారాబాద్ జిల్లా కల్లెక్టరేట్ సమావేశంలో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమం ఏర్పాటు చేసిన సందర్భంగా జిల్లాలో వివిధ ప్రాంతాల నుండి వచ్చిన ప్రజలు 98 పిర్యాదులు సమర్పించారని,వాటిలో ధరణి కి సంబంధించిన భూ సమస్యలు, ఆసరా పెన్షన్లు , ఇరిగేషన్ , భూ సర్వే ఇతర సమస్యలకు సంబంధించి దరఖాస్తులు వచ్చాయని తెలిపారు. మండలాలకు సంబంధించిన పలు గ్రామాల ప్రజలు ఇచ్చిన భూ సమస్యలపై పిర్యాదులను పరిశీలించారు. ఆన్లైన్ రికార్డు చెక్ చేసి, ఫీల్డ్ వెరిఫికేషన్ పూర్తి చేసి రిపోర్ట్ పంపించాలని అధికారులకు ఆదేశించారు. ప్రజావాణి ద్వారా వచ్చిన పిర్యాదులను పెండింగ్ ఉంచకుండా ఎప్పటికప్పుడు పూర్తి చేయాలనీ ఆదేశించారు. భూ సమస్యలకు సంబంధించిన పిర్యాదులను సంబంధిత అధికారులకు పంపి పరిష్కరించేలా చర్యలు తీసుకుంటామని పిర్యాదు దారులకు హామీ ఇచ్చారు.
ఈ సమావేశంలో అదనపు కలెక్టర్ (స్తానిక సమస్తలు ) సుదీర్, ఆర్ డి ఓ వాసు చంద్ర జిల్లా అధికారులు తదితరులు పాల్గొన్నారు.
Save or share this story as a newspaper-style Epaper Clip:
