వికారాబాద్ జిల్లా పెద్దేముల్ మండల లో నమ్మదగిన సమాచారం మేరకు తేది 16.02.2025 రోజున జిల్లా టాస్క్ ఫోర్స్ ఎస్ఐ ఎం.ప్రశాంత్ వర్ధన్,టాస్క్ ఫోర్స్ టీమ్, పెద్దేముల్ పోలీస్ అధికారులు, పెద్దేముల్ వ్యవసాయాధికారి పి.పవన్ ప్రీతం లు పెద్దేముల్ అంబేడ్కర్ విగ్రహం వద్ద ఒక వ్యక్తి నాలుగు ప్లాస్టిక్ సంచులతో అనుమానాస్పదంగా కనిపించగా అతనితో పాటుగా ఉన్న సంచులను పరిశీలించగ వాటిలో ఎలాంటి లేబుల్స్ కాని, లాట్ నెంబర్ గాని, బ్యాచ్ నెంబర్స్ గాని , తయారుచేసిన తేది గాని,గడువు తేది గాని ఎలాంటి సమాచారం లేకుండా పత్తి విత్తనాల ప్యాకెట్లు ఉన్నాయి. ఎలాంటి అనుమతి పత్రాలు లేకుండా పత్తి విత్తనాలు ఉన్నాయి. ఇట్టి విత్తనాలను వ్యవసాయాధికారి పరిశీలించి నకిలీ పత్తి విత్తనాలు అని తెలిపినారు.ఇట్టి వ్యక్తిని అదుపులోకి తీసుకొని విచారించగ అతని పేరు ఉప్పలపాటి వసంత్ రావు రూరల్ కోనంకి గ్రామం, మర్టూర్ మండలం , బాపట్ల జిల్లా, ఆంద్ర ప్రదేశ్ రాష్టం అయితే అతను గత 15 సంరత్సరాల నుండి గాజుర్ కోట్ గ్రామం, గుర్మిట్కల్ తాలూకా , యాద్గీర్ జిల్లా , కర్ణాటక లో నివాసం ఉంటున్నాడు. అని తెలిపాడు. ఇట్టి సంచులలోని నకిలీ విత్తనాలను గుర్మిట్కల్ నుండి తీసుకొని వచ్చి రైతులకు అమ్మడానికి పెద్దేముల్ వచ్చానని తెలపడం జరిగింది. పంటల కాలం లో అంటే జూన్ నెలలో ఈ నకిలీ పత్తి విత్తనాలు తెచ్చే అమ్మితే పోలీస్, వ్యవసాయ అధికారుల నిఘా ఎక్కువగా ఉంటుంది. అని,అందుకే ప్రభుత్వ అధికారులకు అనుమానం రాకుండా ఎక్కువ లాభాల గురించి ముందుగానే ఇట్టి నకిలీ పత్తి విత్తనాలను తీసుకొని వచ్చి అమాయక రైతులకు ఎక్కువ ధరలకు అమ్ముతు మోసపూరితంగా లాభాలు ఆర్జిస్తాము తెలియజేయడం జరిగింది. మొత్తం 4 నాలుగు సంచులలో సుమారు 2,70,000 రూపాయల విలువ కల్గిన , 150 కేజిల నకిలీ పత్తి విత్తనాలు పంచుల సమక్షం లో పంచనామా నిర్వహించి స్వాధీనం చేసుకోవడం జరిగింది. అనంతరం టాస్క్ ఫోర్స్ అధికారులు,పెద్దేముల్ పోలీస్ అధికారులు నిందితుని ప్రస్తుత నివాసం అయిన గాజుర్ కోట్ గ్రామం, గుర్మిట్కల్ తాలూకా , యాద్గీర్ జిల్లా ,కర్ణాటక రాష్టం వెళ్ళి సోదాలు నిర్వహించగా అక్కడ సుమారు 7,20,000 లక్షల రూపాయల విలువ కల్గిన 4 క్వింటల్లా నకిలీ పత్తి విత్తనాలు స్వాధీనం చేసుకోవడం జరిగింది. అతని దగ్గర ఎలాంటి ప్రభుత్వ పత్రాలు కూడా లేవు. ఇట్టి వ్యక్తి పైన పెద్దేముల్ పోలీస్ స్టేషన్ పరిధిలో కేసు నమోదు చేసి అరెస్టు చేయడం జరుగుతుంది. నకిలీ పత్తి విత్తనాల వ్యాపారం చేస్తుండగా ఇతనిపైన గతంలో బషీరాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలో కూడా కేసు నమోదు చేయడం జరిగింది.
జిల్లా పరిధిలో నకిలీ విత్తనాలను విక్రయిస్తున్నట్లుగా సమాచారం అందింతే తక్షణమే పోలీసులకు సమాచారం అందించాలని , రైతులు నకిలీ విత్తనాల బారీన పడకుండా ముందస్తు జాగ్రత చర్యలు తీసుకోవాలని, ఎవరైన వ్యాపారస్థులు, సంస్థలు, వ్యక్తులు నకిలీ విత్తనాలను విక్రయిస్తున్నట్లుగా సమాచారం అందితే తక్షణమే స్థానిక పోలీసులకుగాని లేదా టాస్క్ ఫోర్స్ అధికారులకు గాని డైల్ 100 కు గాని సమాచారం అందించాలని. సమాచారం అందించిన వారి వివరాలను గోప్యంగా ఉంచడం జరుగుతుంది.
సీజ్ చేసిన పత్తి విత్తనాల వివరాలు
1) నాలుగు ప్లాస్టిక్ సంచులలో సుమారు 2,70,000 రూపాయల విలువ కల్గిన 150 కేజిల నకిలీ విత్తనాలు.
2) నిందితుని నివాసం లో సుమారు 7,20,000 రూపాయల విలువ కల్గిన 400 కేజి ల నకిలీ పత్తి విత్తనాలు.
మొత్తం 9,90,000/- రూపాయల విలువ కల్గిన 550 కేజి ల నకిలీ పత్తి విత్తనాలు స్వాధీనం చేసుకోవడం జరిగింది.
నేరస్థుని వివరాలు
సొంత గ్రామం ఉప్పలపాటి వసంత్ రావు రూరల్ కోనంకి గ్రామం, మర్టూర్ మండలం , బాపట్ల జిల్లా, ఆంద్ర ప్రదేశ్ రాష్టం.
ప్రస్తుత గ్రామం గాజుర్ కోట్ గ్రామం, గుర్మిట్కల్ తాలూకా , యాద్గీర్ జిల్లా , కర్ణాటక రాష్టం.
ముందస్తు సమాచారం తో నకిలీ విత్తనాలను పట్టుకున్నా కరణ్ కోట్ ఇన్స్పెక్టర్ నగేష్,పెద్దేముల్ ఎస్ఐ శ్రీధర్ రెడ్డి,టాస్క్ ఫోర్స్ ఎస్ఐ ప్రశాంత్ వర్ధన్ సిబ్బందిని అభినందించడం జరిగింది .