Tnrnews.in Telugu News App | Daily Telugu News Channel In Suryapeta Telangana
ఆంధ్రప్రదేశ్

భక్తి శ్రద్ధలతో శ్రీ షిరిడీ సాయిబాబా వారి 19వ ఆలయ వార్షికోత్సవం

మూలస్థాన అగ్రహారం (ఆలమూరు) : ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా కొత్తపేట నియోజకవర్గం ఆలమూరు మండలం మూలస్థానం అగ్రహారం గౌతమీ గోదావరి తీరాన కొలువైయున్న శ్రీ షిరిడీ సాయిబాబా వారి 19వ ఆలయ వార్షికోత్సవం ఆలయ కమిటీ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. 108 మంది కన్యలతో గౌతమి గోదావరి నుండి తీసుకొచ్చిన జలాలతో పాటు బాబాను ముత్యాల పల్లకిలో గ్రామోత్సవం నిర్వహించి గోదావరి జలాలతో పాటు 40 రకాల పండ్ల రసాలతో ఆలయంలో కొలువైన బాబాకు అభిషేకం, కలశ పూజ నిర్వహించి టన్నున్నర వివిధ రకాల పూలతో ప్రత్యేక అలంకరణ చేశారు. ఉదయం నుండి రావులపాలెం, మండపేట, కడియం, ఆలమూరు మండలాలతో పాటు జిల్లా నలుమూలల నుండి బాబాను భక్తులు దర్శించుకున్నారు. అలాగే ఆలయ కమిటీ ఆధ్వర్యంలో భారీ అన్నదానం నిర్వహించారు.

Related posts

అక్రమ క్వారీ మైనింగ్ పై కలెక్టర్ కు ఫిర్యాదు

భూ పోరాటానికి కదలిన ఎర్రదండు

Dr Suneelkumar Yandra

చిల్లపల్లి ఆధ్వర్యంలో పిఠాపురం.. జయకేతనం సభాప్రాంగణం వద్ద స్వచ్ఛభారత్

Dr Suneelkumar Yandra

మానవత్వమే ఈశ్వరత్వము – పీఠాధిపతి డాక్టర్ ఉమర్ ఆలీషా

TNR NEWS

మున్సిపల్ స్థలం ఆక్రమణ పై పాడాలో ఫిర్యాదు

బెట్టింగ్ మాఫియా డొంక లాగుతున్న పోలీసులు! నిర్వహుకులే అసలైన టార్గెట్..?

Dr Suneelkumar Yandra