Tnrnews.in
తెలంగాణ

దేశానికే ఆదర్శం సన్న బియ్యం పథకం

తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వం అమలు చేస్తున్న సన్న బియ్యం పథకం దేశానికే ఆదర్శంగా నిలుస్తుందని కోదాడ ఎమ్మెల్యే ఉత్తమ్ పద్మావతి రెడ్డి అన్నారు. సోమవారం కోదాడ పట్టణంలో సన్న బియ్యం లబ్ధిదారుడు షేక్ యాకుబ్ నివాసంలో మాజీ ఎమ్మెల్యే వేనేపల్లి చందర్ రావు కాంగ్రెస్ పార్టీ నాయకులతో కలిసి లబ్ధిదారుల ఇంట్లో సహపంక్తి భోజనాలు చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి లకు కోదాడ నియోజకవర్గ ప్రజల పక్షాన కృతజ్ఞతలు తెలిపారు. మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి పౌరసరఫరాల శాఖ మంత్రిగా బాధ్యతలు తీసుకున్న నాటి నుంచి రైతులు, పేద ప్రజల సంక్షేమం కోసం నిరంతరం పనిచేస్తూ ఎన్నో పథకాలను తీసుకువచ్చి పేదల జీవితాల్లో వెలుగులు నింపుతున్నారని తెలిపారు. రైతు భరోసా, బోనస్ పథకాలతోపాటు దేశంలో ఎక్కడా లేని విధంగా సన్న బియ్యం పథకం అమలు చేసి ఉచిత బస్సు, ఉచిత కరెంటు, సబ్సిడీ గ్యాస్ వంటి పథకాలను అమలు చేసిన ఘనత కాంగ్రెస్ పార్టీకే దక్కుతుందన్నారు. కాంగ్రెస్ పార్టీ తోనే అన్ని వర్గాల ప్రజలకు న్యాయం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో పిసిసి డెలిగేట్ చింతకుంట్ల లక్ష్మీనారాయణ రెడ్డి, మాజీ సర్పంచ్ డిసిసి ఉపాధ్యక్షులు పారా సీతయ్య, మాజీ మున్సిపల్ చైర్మన్ సామినేని ప్రమీల, మార్కెట్ కమిటీ చైర్మన్ ఏపూరి తిరుపతమ్మ సుధీర్, పాలూరి సత్యనారాయణ,గుండెల సూర్యనారాయణ,కాంగ్రెస్ పార్టీ టౌన్ వర్కింగ్ ప్రెసిడెంట్ యడవెల్లి బాల్ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు…………

Save or share this story as a newspaper-style Epaper Clip:

Related posts

కోర్టులో ఈ-సేవ కేంద్రం ప్రారంభం 

TNR NEWS

విద్య ద్వారా పేదరికం నుంచి శాశ్వతంగా విముక్తి….. అదనపు కలెక్టర్ డి.వేణు మైనారిటీ సంక్షేమ దినోత్సవ వేడుకల్లో పాల్గొన్న అదనపు కలెక్టర్

TNR NEWS

42 శాతం రిజర్వేషన్ కొరకు బీసీలు చేస్తున్న ఉద్యమానికి సకజనులూ మద్దతు ఇవ్వండి

TNR NEWS

అగ్గి తెగులు కి నివారణ చర్యలు చేపట్టాలి 

Harish Hs

సిపిఎస్ విధానాన్ని రద్దు చేయాలి

Harish Hs

తడిసిన ధాన్యం…ఎండలో ఆరబోసిన రైతు 

TNR NEWS