రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా రైతుల మేలు కొరకు అమలు చేసిన భూ భారతి చట్టంపై నిర్వహిస్తున్న సదస్సుకు మండల వ్యాప్తంగా ఉన్న రైతులు హాజరుకావాలని కాంగ్రెస్ మండల పార్టీ అధ్యక్షులు కొప్పుల జైపాల్ రెడ్డి అన్నారు. గురువారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ రైతులకు చెందిన వ్యవసాయ భూ సమస్యలను ఆన్లైన్ ద్వారా సులుభ పద్ధతిలో పరిష్కరించే మార్గంపై మండల కేంద్రంలోని నేడు శుక్రవారం స్థానిక జడ్పీహెచ్ఎస్ హైస్కూల్లో నిర్వహించే భూభారతి అవగాహన సదస్సు కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా స్థానిక ఎమ్మెల్యే ఉత్తమ్ పద్మావతి రెడ్డి, జిల్లా కలెక్టర్ నందులాల్ పవార్ హాజరై క్లుప్తంగా వివరించనున్నారు కావున ఇట్టి సదస్సు కార్యక్రమానికి గ్రామ శాఖ అధ్యక్షులు మండల పార్టీ నాయకులు కార్యకర్తలు, రైతులు అధిక సంఖ్యలో హాజరుకావాలని కోరారు.
Save or share this story as a newspaper-style Epaper Clip:
