Tnrnews.in Telugu News App | Daily Telugu News Channel In Suryapeta Telangana
తెలంగాణ

కార్పొరేట్ కు దీటుగా కోదాడ ప్రభుత్వ వైద్యశాలను తీర్చిదిద్దుతా

కోదాడ ప్రభుత్వ ఆసుపత్రిని కార్పొరేట్ కు దీటుగా తీర్చిదిద్దుతానని ఎమ్మెల్యే ఉత్తమ్ పద్మావతి రెడ్డి అన్నారు.శనివారం పట్టణంలోని ప్రభుత్వ ఆసుపత్రి ఆవరణలో 10 లక్షల రూపాయలతో నూతనంగా ఏర్పాటు చేసిన విద్యుత్ ట్రాన్స్ ఫార్మర్ ను ప్రారంభించారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పేదలకు మెరుగైన వైద్య సేవలు అందించాలన్న లక్ష్యంతో 26 కోట్ల రూపాయలతో వంద పడకల ఆసుపత్రిని నిర్మిస్తున్నట్లు తెలిపారు. త్వరలోనే 3కోట్ల 66 లక్షల రూపాయలతో ఏర్పాటు చేసిన సిటీ స్కాన్ యంత్రం అందుబాటులోకి వస్తుందన్నారు. ఉమ్మడి జిల్లాలోనే మొట్టమొదటిసారిగా కోదాడ ప్రభుత్వ ఆసుపత్రిలో ఒక డాక్టర్ ముగ్గురు స్టాప్ నర్సులతో కలిపి జాతీయ రాబిస్ కంట్రోల్ ప్రోగ్రాం ఏర్పాటు చేయడంతో పాటు పుట్టుకతో బరువు తక్కువ ఉన్న పిల్లలందరికీ రిహాబిటేషన్ సెంటర్ ను ప్రారంభించనున్నట్లు తెలిపారు. ఆసుపత్రిలో జరుగుతున్న పనుల్లో వేగం పెంచాలని సిబ్బందికి సూచించారు. పేదలకు మెరుగైన వైద్య సేవలు అందించడమే ప్రభుత్వ లక్ష్యం అని అన్నారు.ఈ కార్యక్రమంలో పిసిసి డెలిగేట్ చింతకుంట లక్ష్మీనారాయణ రెడ్డి, జిల్లా గ్రంధాలయ చైర్మన్ వంగవీటి రామారావు, ఆర్డీవో సూర్యనారాయణ, డి సి హెచ్ ఎస్ వెంకటేశ్వర్లు, ప్రభుత్వ ఆసుపత్రి సూపరిండెడ్ డాక్టర్ దశరథ, కమిషనర్ రమాదేవి,వైద్యులు అభిరామ్, వైష్ణవి, నరసింహ, నాయకులు కేఎల్ఎన్ ప్రసాద్, సామినేని ప్రమీల, కందుల కోటేశ్వరరావు, కమదన చందర్ రావు, మధు, ఈదుల కృష్ణయ్య, రామినేని శ్రీనివాసరావు, డాక్టర్ బ్రహ్మం, బాగ్దాద్, భాజాన్ ముస్తఫా తదితరులు పాల్గొన్నారు………

Related posts

కోదాడలో ఘనంగా హనుమాన్ జయంతి వేడుకలు

Harish Hs

ఈనెల 24న జిల్లా కరాటే అసోసియేషన్ల ముఖ్య సమావేశం

Harish Hs

రోడ్డు భద్రత నియమాలు పాటించాలి

Harish Hs

పెండింగ్లో ఉన్న పిఆర్సి,డిఏ లను విడుదల చేయాలి

Harish Hs

వాసవి మత మహా చండి పూజ

TNR NEWS

ప్రజల ఆరోగ్యాలతో చెలగాటలాడితే చట్టపరమైన చర్యలు తప్పవు

TNR NEWS