గొల్లప్రోలు : గొల్లప్రోలు మండలం ఫోటో గ్రాఫర్ యూనియన్ ఎన్నికలు జరిగాయి. మండలంలోని సుమారు 35 మంది ఫోటో గ్రాఫర్లు ఉండగా 25 ఓట్లు వచ్చినట్లు తెలిపారు. అందులో 18 ఓట్లు కేశవమతం శేషుకి పోల్ అవ్వగా అధ్యక్షుడిగా నియమించారు. కార్యదర్శిగా బండారి రమణ, ఉపాధ్యక్షుడిగా సూరిబాబు ఎన్నికయ్యారు. ఈ సందర్భంగా అధ్యక్ష, కార్యదర్శులు మాట్లాడుతూ మండలంలో ఉన్న ఫోటోగ్రాఫర్ల అభ్యున్నతికి కృషి చేస్తామన్నారు. అదే విధంగా సాంకేతిక పరిజ్ఞానం పై అవగాహన కల్పించడం జరుగుతుందన్నారు. రెండేళ్ల పదవీకాలంలో యూనియన్ అభివృద్ధికి నిరంతరం కృషి చేస్తామని తెలిపారు. అధ్యక్ష, కార్యదర్శిగా ఎన్నికైన కేశవమతం శేషు, బండారి రమణలను ఫోటోగ్రాఫర్లు అందరూ పూలమాలలు వేసి, దుశ్శాలువతో సత్కరించారు.
Save or share this story as a newspaper-style Epaper Clip:
