విశాఖ స్టీల్ప్లాంట్లో మెటల్ లిక్విడ్ ల్యాడల్ పేలడంతో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. సుమారు 1500 డిగ్రీల వేడి కలిగిన స్టీల్ మెటల్ లిక్విడ్ పేలిపోవడంతో అక్కడ పనిచేస్తున్న కార్మికులు తీవ్రంగా గాయపడ్డారు. ఘటనలో అప్పారావు, సత్యానంద్, సూరిబాబు, పైడి రాజుతో పాటు రావూరి మల్లికార్జునరావు, పల్లెల శ్రీనివాసరావు గాయపడినట్లు సమాచారం. క్షతగాత్రులను వెంటనే ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ప్రమాదానికి గల కారణాలపై అధికారులు దర్యాప్తు చేపట్టారు.
Save or share this story as a newspaper-style Epaper Clip:
