Tnrnews.in
తెలంగాణ

కరివిరాలలో ఎస్‌ఐఆర్ కార్యక్రమంలో పాల్గొన్న మాజీ ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్

ప్రభుత్వం చేపట్టిన ఎస్‌ఐఆర్ (SIR) కార్యక్రమంలో భాగంగా కోదాడ నియోజకవర్గ మాజీ శాసనసభ్యులు శ్రీ బొల్లం మల్లయ్య యాదవ్ గారు తన స్వగ్రామమైన కరివిరాల గ్రామంలో నిర్వహిస్తున్న ఎన్నియుమరేషన్ (Enumeration) ప్రక్రియలో పాల్గొన్నారు.

ఈ సందర్భంగా ఆయన స్వయంగా ఎన్నియుమరేషన్ ఫారాన్ని పూరించి సంబంధిత అధికారులకు అందజేశారు.

ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ కార్యక్రమం (SIR) తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత తొలిసారిగా నిర్వహించబడుతోంది.

దేశవ్యాప్తంగా ఇప్పటివరకు 13 సార్లు నిర్వహించిన ఈ కార్యక్రమాన్ని ప్రస్తుతం 14వ సారి చేపడుతున్నారు.ఈ ప్రక్రియ ద్వారా ఎన్నికల సంఘం ఓటర్ల జాబితాను సమగ్రంగా పరిశీలించి, అర్హులైన ఓటర్లను చేర్చడం, అనర్హులను తొలగించడం, అవసరమైన మార్పులు, చేర్పులు చేయడం ద్వారా ఖచ్చితమైన ఓటర్ల జాబితాను రూపొందిస్తుంది.అర్హులైన ప్రతి ఒక్కరూ ఎలాంటి సందేహాలు లేకుండా నిర్ణీత గడువులోపు తమ వివరాలను నమోదు చేసుకోవాలని పేర్కొన్నారు.అందువల్ల ప్రతి ఓటరు తప్పనిసరిగా SIR కార్యక్రమంలో పాల్గొని ఎన్యుమరేషన్ ఫారం నింపేలా, బూత్ ఏజెంట్లు చొరవ తీసుకుని ప్రజలకు అవగాహన కల్పించి ఈ ప్రక్రియను విజయవంతం చేయాలని కోరారు

Save or share this story as a newspaper-style Epaper Clip:

Related posts

నవోదయ లో సీటు సాధించిన సాయి గాయత్రి విద్యాలయ విద్యార్థిని

TNR NEWS

కొత్త మెనూ ఖచ్చితంగా పాటించాలి బాన్సువాడ సబ్ కలెక్టర్ కిరణ్మయి

TNR NEWS

తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత.. బయటకు రావాలంటేనే వణుకుతున్న జనం..!!*

TNR NEWS

వయోవృద్ధుల సమస్యలు పరిష్కరించాలి

TNR NEWS

ఎన్నికల్లో మాదిగలకు ఇచ్చిన హామీలు అమలు చేయాలి

Harish Hs

కేంద్ర ప్రభుత్వం కార్మిక వ్యతిరేక విధానాలను విడనాడాలి

TNR NEWS