Tnrnews.in Telugu News App | Daily Telugu News Channel In Suryapeta Telangana
తెలంగాణపుణ్యక్షేత్రాలు

పిల్లలమర్రిలో పర్యాటక అభివృద్ధికి కృషి…..

 

తెలంగాణ పర్యాటక అభివృద్ధి సంస్థ చైర్మన్ పటేల్ రమేష్ రెడ్డి సహకారంతో పిల్లలమర్రి లో నానాటికి దినాభివృద్ధి చెందుతున్న కాకతీయులు నిర్మించిన శివాలయాలకు తోడుగా పర్యాటకాన్ని అభివృద్ధి చేసేందుకు కృషి చేస్తామని కాంగ్రెస్ జిల్లా నాయకులు గట్టు శ్రీనివాస్ అన్నారు.శివాలయాల్లో కార్తీక సోమవారాన్ని పురస్కరించుకొని ప్రత్యేక పూజలు చేసి మాట్లాడారు. సూర్యాపేట జిల్లాలో పర్యాటక రంగాన్ని అభివృద్ధి చేసేందుకు సీఎం రేవంత్ రెడ్డి సహకారం తో ఇప్పటికే పటేల్ రమేష్ రెడ్డి ప్రభుత్వం నుండి నిధులు మంజూరు చేయించినట్లు చెప్పారు. నియోజకవర్గంలో ఉండ్రుగొండ కు రెండున్నర కోట్లు, సద్దుల చెరువు మిని ట్యాంక్ బండ్ కు 5 కోట్లు, పిల్లలమర్రి కి 3 కోట్లతో అభివృద్ది చేసేందుకు నిధులు మంజూరు కాగా పనులు త్వరలో ప్రారంభమవుతాయన్నారు. ముందుగా దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి శ్రీనివాస్ జ్యోతి దంపతులు అర్చకులకు కార్తీక దీపదానాన్ని చేశారు. ఆయన వెంట బండారు సత్యనారాయణ, పద్మ, ప్రవీణ్, వెంకన్న, ఉదయ్ పలువురు కాంగ్రెస్ నాయకులు ఉన్నారు.

Related posts

శ్మశాన వాటికలు నిర్మించారు.విద్యుత్ సప్లై మరిచారు

TNR NEWS

సూక్ష్మ కళాకారుడి అద్భుత ప్రతిభ

TNR NEWS

హైవేపై వెలగని లైట్లు… వెలిగించాలని ఆఫీసర్లను వేడుకొన్న సామాజిక సేవా కార్యకర్త గంధం సైదులు

TNR NEWS

కాంగ్రెస్ పాలనలో మిషన్ భగీరథ పై పర్యవేక్షణ కరువు  మున్సిపల్ వైస్ చైర్మన్ పుట్ట కిషోర్

TNR NEWS

సైబర్ నేరాల పట్ల విద్యార్థులు అప్రమత్తంగా ఉండాలి

Harish Hs

అంగన్‌వాడీ కేంద్రంలో పోషణ పక్షం పై అవగాహన

TNR NEWS