తెలంగాణ : హైదరాబాద్లో ప్రజా భద్రత, మహిళా రక్షణను బలోపేతం చేసేందుకు, పౌరుల భాగస్వామ్యాన్ని పెంచేందుకు సరికొత్త సంస్కరణలు చేపడుతున్నట్లు హైదరాబాద్ సిటీ పోలీస్ కమిషనర్ వీసీ సజ్జనార్ తెలిపారు. ఇందులో భాగంగా ప్రతి పోలీస్ స్టేషన్ పరిధిలో ఒక కానిస్టేబుల్ను ‘పోలీస్ మెంటార్’గా నియమించనున్నట్లు ప్రకటించారు. మహిళలు తమ సమస్యలను భయం లేకుండా వెల్లడించేందుకు “స్పందన – ఆల్ ఉమెన్ ఫస్ట్ రెస్పాండర్ సిస్టమ్”ను అందుబాటులోకి తెచ్చినట్లు సీపీ తెలిపారు.
