Tnrnews.in Telugu News App | Daily Telugu News Channel In Suryapeta Telangana
తెలంగాణ

పేదల డబ్బా కోట్లకు నోటీసులు ఇవ్వడం అన్యాయం……

రోడ్డు పక్కన చిన్న చిన్న డబ్బా కోట్లు పెట్టుకొని జీవనోపాధి పొందుతున్న చిరు వ్యాపారులను ఖాళీ చేయాలంటూ మున్సిపల్ అధికారులు నోటీసులు ఇవ్వడం సరైనది కాదని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు షేక్ బషీర్ అన్నారు. శుక్రవారం కోదాడ పట్టణంలోని బాయ్స్ హై స్కూల్ వద్ద చిరు వ్యాపారులతో పండ్ల వ్యాపారస్తుల సంఘం అధ్యక్షులు,మాజీ కౌన్సిలర్ షేక్ షమీతో కలిసి సమావేశం నిర్వహించి మాట్లాడారు.బడా బాబులు ఆక్రమించుకుంటే పట్టించుకోని వారు జీవనోపాధి కొరకు చిన్న చిన్న డబ్బి కోట్లు వేసుకున్న వారిని వేధించడం సరైనది కాదన్నారు.సమస్యను మంత్రి ఉత్తమ్,ఎమ్మెల్యే పద్మావతి దృష్టికి తీసుకువెళ్లి చిరు వ్యాపారులకు నష్టం జరగకుండా చూస్తామన్నారు.ఏ ఒక్కరు ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు.ఈ సమావేశంలో మాజీ కౌన్సిలర్ షేక్ షమీ, మజాహర్,జానీ మియా, వెన్నెల శ్రీను, రామకృష్ణ,ఖలీల్, షేక్ జానీ, గంధం రామకృష్ణ, మహమూద్, అహ్మద్ తదితరులు పాల్గొన్నారు…….

Related posts

11న జరిగే మాదిగల ధర్మ యుద్ధ సమావేశం విజయవంతం చేయండి కళ్ళే పెళ్లి ప్రణయ్ దీప్ మహాజన సోషలిస్టు పార్టీ వరంగల్ జిల్లా అధ్యక్షులు

TNR NEWS

కార్పెంటర్ కార్మికులందరూ ఐక్యంగా ఉండాలి

TNR NEWS

కోదాడ లో కిడ్నీ రాకెట్ ముఠా అరెస్ట్

Harish Hs

విద్యార్థుల్లో ప్రతిభను వెలికి తీసేందుకు టాలెంట్ టెస్టులు

Harish Hs

ఆర్యవైశ్యులు ఇతరులకు ఆదర్శంగా నిలవాలి

TNR NEWS

యూత్ కాంగ్రెస్ మండల అధ్యక్షులుగా మల్గారి కార్తీక్ రెడ్డి

TNR NEWS