Tnrnews.in
తెలంగాణవిద్య

జిల్లాలో గ్రూప్- III రాత పరీక్ష కేంద్రాల వద్ద పటిష్టమైన బందోబస్తు

నేడు,సోమవారం రెండు రోజులు పాటు జరిగే గ్రూప్-III రాత పరీక్షా కేంద్రాల వద్ద ఎలాంటి అవాంచనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా పోలీసు శాఖ పటిష్ట భద్రతా, బందోబస్తు ఏర్పాట్లు చేయడం జరిగిందని సూర్యాపేట జిల్లా ఎస్పి సన్ ప్రీత్ సింగ్ ఐపీఎస్ శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. సూర్యాపేట పట్టణంలో 30, కోదాడ పట్టణంలో 20 పరీక్ష కేంద్రాలు ఉన్నాయి, ఈ కేంద్రాల వద్ద ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 8 గంటల వరకు 163 బి.ఎన్.యస్.యస్ (144 సెక్షన్) అమలులో ఉంటుందని తెలిపారు. పరీక్ష కేంద్రాల సమీపంలో ఉన్న అన్ని జిరాక్స్ సెంటర్స్, ఇంటర్ నెట్ సెంటర్స్, మరియు చుట్టుపక్కల లౌడ్ స్పీకర్లు మూసి వేయాలని, మరియు పరీక్ష సెంటర్స్ వద్ద నుండి 500 మీటర్ల వరకు ప్రజలు గుంపులుగా చెరవద్దు అని కోరారు. పరీక్షకు హాజరయ్యే అభ్యర్థులు హాల్ టికెట్ నందు పొందుపరిచిన విధంగా సమయానికి చేరుకోవాలని అన్నారు. అభ్యర్థులు తమవెంట పరీక్షా హాల్ లోకి సెల్ ఫోన్లు, ట్యాబ్, పెన్ డ్రైవ్, బ్లూటూత్, ఎలక్ట్రానిక్ వాచ్, కాలిక్యులేటర్లు, వాలెట్లు వంటివి తీసుకువెళ్లడానికి అనుమతి లేదు అన్నారు. కాళ్లకు షూ వేసుకోవద్దు. పరీక్ష కేంద్రంలోకి వెళ్లేముందే ప్రధాన గేట్ వద్ద తనిఖీలు నిర్వహించే పోలీసు వారికి సహకరించగలరని పేర్కొన్నారు. ప్రయాణ సమయంలో జాగ్రత్తలు తీసుకోవాలని కోరారు, వాహనాలు వేగంగా నడపవద్దు అన్నారు. ముందుగా బయలుదేరి ఎలాంటి వత్తిడి లేకుండా పరీక్షా వ్రాయాలని అభ్యర్థులకు శుభాకాంక్షలు తెలిపినారు.

Save or share this story as a newspaper-style Epaper Clip:

Related posts

గురుపౌర్ణమికి ముస్తాబైన సాయిబాబా ఆలయం

Harish Hs

25 న బిఆర్ఎస్ ముఖ్య కార్యకర్తల సమావేశం 

TNR NEWS

తల్లిదండ్రులకు కౌన్సిలింగ్ నిర్వహించిన ట్రాఫిక్ సిఐ

TNR NEWS

కోదాడ పట్టణ, నియోజకవర్గ నిరుద్యోగులకు గొప్ప సువర్ణ అవకాశం

TNR NEWS

మహిళలు వ్యాపారస్తులుగా మారాలి

TNR NEWS

పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం

Harish Hs