Tnrnews.in Telugu News App | Daily Telugu News Channel In Suryapeta Telangana
తెలంగాణ

సైబర్ నేరాల పట్ల అప్రమత్తంగా ఉండాలి – సోషల్ మీడియాతో జాగ్రత్తగా ఉండాలి – ఎవరో చెప్పే మాయ మాటలు విని మోసపోవద్దు – సీనియర్ జూనియర్ అని చూడకుండా స్నేహభావంతో కలిసిమెలిసి ఉండాలి – గజ్వేల్ రూరల్ సిఐ మహేందర్ రెడ్డి

 

సిద్దిపేట జిల్లా గౌరారం పోలీస్ స్టేషన్ పరిధిలోని కావేరి యూనివర్సిటీ విద్యార్థినిలకు మహిళల రక్షణకు ఉన్న చట్టాల గురించి, గుడ్ టచ్ బాడ్ టచ్, యాంటీ ర్యాగింగ్ తదితర అంశాల గురించి అవగాహన కల్పించిన గజ్వేల్ రూరల్ సిఐ మహేందర్ రెడ్డి, గజ్వేల్ షీ టీమ్ బృందం, భరోసా సెంటర్ సిబ్బంది. గజ్వేల్ రూరల్ సిఐ మహేందర్ రెడ్డి మాట్లాడుతూ మహిళల రక్షణకు ఉన్న చట్టాల గురించి, షీటీమ్ నిర్వహిస్తున్న విధుల గురించి, షీటీమ్ ద్వారా ఎలా రక్షణ పొందొచ్చు అనే అంశాల గురించి, ర్యాగింగ్, ఇవిటీజింగ్, పోక్సో, షీ టీమ్స్, యాంటీ హ్యుమెన్ ట్రాఫికింగ్ సైబర్ నేరాలు, నూతన చట్టాల గురించి, మరియు అపరిచిత వ్యక్తుల యొక్క ఫోన్ కాల్స్ మరియు మాటలు నమ్మవద్దు, సోషల్ మీడియాకు ఎంత దూరం ఉంటే భవిష్యత్ అంత మంచిగా ఉంటుంది. మహిళల భద్రతకు ఎల్లవేళలా అందుబాటులో ఉంటాం మహిళల భద్రత మా ముఖ్య బాద్యత. చదువుకునే సమయములో చెడు అలవాట్లకు బానిస కావొద్దు అన్నారు. ప్రతి ఒక్కరూ చదువుపై దృష్టి సారించాలని తెలిపారు, డ్రగ్స్ మరియు ఇతర మత్తు పదార్థాలపై అప్రమత్తంగా ఉండాలన్నారు. చదువుకోవడం వలన భవిష్యత్తు ఉన్నతంగా ఉంటుందని పిల్లలను చదివించటానికి తల్లిదండ్రులు చేస్తున్న కష్టాన్ని మనసులో పెట్టుకొని చదువుపై శ్రద్ధ వహించాలని మరియు సామాజిక రుగ్మతల గురించి అవగాహన అవగాహన కల్పించడం జరిగింది. ఈ కార్యక్రమంలో కావేరి యూనివర్సిటీ చైర్మన్ ప్రతాప్ కుమార్ రెడ్డి, మరియు ప్రొఫెసర్లు, గజ్వెల్ షీటీమ్ బృందం శ్రీరాములు ఏఎస్ఐ, మహిళా కానిస్టేబుల్ శ్యామల, కానిస్టేబుళ్లు రాంచంద్రారెడ్డి, మహేష్, భరోసా సెంటర్ సిబ్బంది హరిత, వినోద, సోనీ, యూనివర్సిటీ విద్యార్థినిలు పాల్గొన్నారు.

Related posts

మొక్కుబడిగా సామాజిక తనిఖీ 

TNR NEWS

పెద్దపల్లి లో ఘోర రోడ్ ప్రమాదం

TNR NEWS

జోగిపేట వ్యాపారి వినయ్‌పై టోల్‌ప్లాజా సిబ్బంది దాడి  సంగారెడ్డి ఆసుపత్రికి తరలింపు

TNR NEWS

బీఆర్ఎస్ నేతల ముందస్తు అరెస్ట్ 

TNR NEWS

స్వర్ణ భారతి ట్రస్ట్ ఆధ్వర్యంలో చలివేంద్రం ప్రారంభం

Harish Hs

లక్ష డప్పులతో సత్తా చాటుతాం

Harish Hs