Tnrnews.in Telugu News App | Daily Telugu News Channel In Suryapeta Telangana
తెలంగాణవిద్య

విద్యార్థుల జీవితాలతో ప్రభుత్వ చెలగాటం స్కాలర్‌షిప్‌ నిధులివ్వాలి కళ్లకు గంతలతో ఏఐఎస్‌ఎఫ్‌ నిరసన

 

కరీంనగర్‌ ఎడ్యుకేషన్‌:

పెండిరగులో ఉన్న స్కాలర్‌షిప్‌, ఫీజు రీయింబర్స్‌మెంట్‌ నిధులు విడుదల చేయకుండా ప్రభుత్వం విద్యార్థుల జీవితాలతో చెలగాటమాడుతోందని ఏఐఎస్‌ఎఫ్‌ జిల్లా కార్యదర్శి మచ్చ రమేష్‌ ఆరోపించారు. పెండిరగులో ఉన్న స్కాలర్‌షిప్‌, ఫీజు రీయింబర్స్‌మెంట్‌ నిధులు విడుదల చేయాలని బుధవారం కళ్లకు గంతలు కట్టుకొని నిరసన తెలిపారు. ఈ సందర్భంగా రమేశ్‌ మాట్లాడుతూ నెల రోజుల్లో బకాయిలు విడుదల చేస్తామని హామీ ఇచ్చినప్పటికీ, ఇంకా విడుదల చేయలేదన్నారు. ప్రభుత్వం చూసిచూడనట్టుగా వ్యవహరిస్తోందని, దీంతో పేద విద్యార్థులు ఉన్నత చదువులు మధ్యలోనే ఆపేయాల్సిన పరిస్థితి తలెత్తుతోందన్నారు. అటు చదువులు కొనసాగించలేక, ఇటు మధ్యలో ఆపేయలేక విద్యార్థుల భవిష్యత్తు అగమ్యగోచరంలో పడుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని పెండిరగులో ఉన్న స్కాలర్షిప్‌, ఫీజు రీయింబర్స్‌మెంట్‌ బకాయిలను తక్షణమే విడుదల చేయాలని డిమాండు చేశారు. ఈ కార్యక్రమంలో ఏఐఎస్‌ఎఫ్‌ నాయకులు కసిరెడ్డి సందీప్‌ రెడ్డి, మచ్చ అభిలాష్‌, శ్రీనివాస్‌, నరేష్‌, సురేష్‌, రవి, మహేష్‌ తదితరులు పాల్గొన్నారు.

Related posts

సన్రైజ్ వెస్ట్ జోన్ వాకర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఘనంగా యోగా దినోత్సవం

Harish Hs

వేసవిలో దాహార్తిని తీర్చడం అభినందనీయం

TNR NEWS

సమగ్ర సర్వే చేసుకున్న స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్

TNR NEWS

జోగిపేట వ్యాపారి వినయ్‌పై టోల్‌ప్లాజా సిబ్బంది దాడి  సంగారెడ్డి ఆసుపత్రికి తరలింపు

TNR NEWS

పుట్టినరోజు సందర్భంగా మొక్కలు నాటిన న్యాయవాది

Harish Hs

ఆరుగ్యారెంటీల పేరుతో ప్రజలను ఆగం చేసిండ్లు* – ఏడాది కావస్తున్నా ఇచ్చిన హమీలు అమలు చేయలే – పథకాల అమలులో మ్యానీఫెస్టో కమిటి చైర్మన్‌ విఫలం – మంథని మాజీ ఎమ్మెల్యే పుట్ట మధూకర్‌

TNR NEWS