మహబూబాబాద్ జిల్లా, తొర్రూర్ మండలం ఫతేపురం గ్రామ పంచాయతీ కార్మికుని కుటుంబానికి అమ్మాపురం గ్రామస్తులు 50 కెజీ ల బియ్యం అందచేయడం జరిగింది. కాగా గ్రామ పంచాయతీ కార్మికుని భార్య డొనక లక్ష్మి ఇటీవల అనారోగ్య కారణంతో మరణించడం జరిగింది. గ్రామానికి నిత్య సేవ చేసే కార్మికున్ని ఆదుకోవడం మన కర్తవ్యమని గ్రామస్తులు బియ్యం సహాయం చేశామని ఈ సందర్బంగా చెప్పడం జరిగింది.అనంతరం అమ్మాపురం గ్రామ ప్రజలు డొనక లక్ష్మి కుటుంబ సభ్యులను పరామర్శించి, దైర్యం చెప్పడం జరిగింది.ఈ కార్యక్రమం లో మార్క శ్రీనివాస్, ముద్దం మహబూబ్ రెడ్డి,మాచర్ల అనిల్,సమ్మయ్య, ఉప్పలయ్య, రమేష్ తదితరులు పాల్గొన్నారు.
Save or share this story as a newspaper-style Epaper Clip:
