మండలం లోని వెంకట్రావు పేట జిల్లా పరిషత్ ఉన్నత పాటశాలలో సావిత్రీబాయి పులే జయంతి సందర్భముగా జాతీయ మహిళా ఉపాద్యాయ దినోత్సవము ఘనంగా నిర్వహించారు. సావిత్రీబాయి పటానికి పూలమాల వేసి ఆమె జీవితం విద్యార్థులకు స్ఫూర్తి అని,అణగారిన వారి జీవితాలకు ఆమె అందించిన విద్య మన అందరికీ ఆదర్శప్రాయం అని, మన జీవితములో సావిత్రీబాయి పోరాటపటిమ ఎంతో స్ఫూర్తి, ప్రాధాన్యత కలిగి ఉందని ఉపాద్యాయులు తమ ప్రసంగాల ద్వారా వివరించడం జరిగింది.తదుపరి పాఠశాల ప్రధానోపాధ్యాయులు శ్రీమతి నయీమ కౌసర్ గారిని ఉపాధ్యాయ బృందం, విద్యార్థులు కలిసి శాలువ ,పుష్పగుచ్చం తో సన్మానం చేశారు.
Save or share this story as a newspaper-style Epaper Clip:
