Tnrnews.in Telugu News App | Daily Telugu News Channel In Suryapeta Telangana
తెలంగాణ

ప్రణాళికా బద్ధంగా చదివి ఉన్నత స్థాయికి చేరుకోవాలి

కోదాడ యం యస్ జూనియర్ కళాశాల ద్వితీయ సంవత్సర విద్యార్థులకు ప్రథమ సంవత్సర విద్యార్థులు ఏర్పాటు చేసిన వీడ్కోలు సమావేశానికి కళాశాల ప్రిన్సిపాల్ యం.ప్రసాద్ అధ్యక్షత వహించారు.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన కోదాడ ప్రముఖ వైద్యులు డా:జాస్తి సుబ్బారావు ముందుగా సరస్వతి విగ్రహానికి జ్యోతి ప్రజ్వలన గావించారు.వారు మాట్లాడుతూ విద్యార్థులు ప్రణాళికా బద్ధంగా చదివి ఉన్నత స్థాయికి ఎదగాలని,మనిషిని మనిషిగా గౌరవించాలని అన్నారు.పట్టుదలతో ఏదైనా సాధింప వచ్చని,విద్యార్థులు ఎప్పటికప్పుడు నూతన విషయాల పట్ల పరిజ్ఞానం పెంపొందించుకోవాలన్నారు.ఈ నాడు యువత గంజాయి,మత్తు పదార్ధాల కు బానిసలు అవుతున్నారని వాటి నివారణకు ఉపాధ్యాయులు,తల్లిదండ్రులు,యాజమాన్యాలు అవగాహన కల్పించాలన్నారు.వ్యాయామానికి ప్రతి ఒక్కరూ సమయం కేటాయిస్తే మనిషి పరిపూర్ణ ఆరోగ్యంగా ఉంటారన్నారు.ఈ కార్యక్రమంలో యం యస్ విద్యా సంస్థల చైర్మన్ పందిరి నాగిరెడ్డి,సీ ఈ ఓ యస్ యస్ రావు,శ్రీ సాయి వికాస్ డిగ్రీ తేజా ఫార్మసీ కళాశాలల ప్రిన్సిపాల్స్ పి.గంగాధర్,యాదగిరి రెడ్డి,అధ్యాపకులు పాషా, వీరస్వామి,వెంకటరెడ్డి,z.శ్రీనివాసరావు,b.శ్రీనివాస రావు,రహీమ్,ఇనుద్దీన్,కల్పన,సునీత సిబ్బంది బ్రహ్మం,లక్ష్మి తదితరులు పాల్గొన్నారు.కళాశాల నిర్వహించిన వివిధ రకాల ఆటల పోటీలలో గెలుపొందిన విజేతలకు ముఖ్య అతిథి బహుమతులు అందజేశారు. అతిధులని విద్యార్థులు శాలువాలతో ఘనంగా సన్మానించారు.విద్యార్థులు అలరించిన నృత్యాలు పలువురిని ఆకట్టుకున్నాయి.

Related posts

*మాలల సింహాగర్జనను విజయవంతం చేయాలి* ● సమతా సైనిక్ దళ్ ఆధ్వర్యంలో మండల పరిధిలోని పలు గ్రామాల్లో సింహగర్జన వాల్ పోస్టల్ ఆవిష్కరణ

TNR NEWS

విద్యార్థులు కష్టపడి చదివిన చదువు వృధా కాదు

TNR NEWS

మణుక దేవాలయంకు వచ్చే భక్తులకు నీళ్లకష్టాలు…

TNR NEWS

యాంటి నార్కోటిక్స్ పై అవగాహన సదస్సు

TNR NEWS

ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు

TNR NEWS

ఎలాంటి అనుమతులు లేకుండా అక్రమంగా ఇసుకను తరలిస్తున్న (04 ) ట్రాక్టర్లను పట్టుకున్న టాస్క్ ఫోర్స్ పోలీసులు

TNR NEWS