రానున్న సంక్రాంతి సందర్భంగా సాయి గాయత్రి విద్యాలయలో శుక్రవారం విద్యార్థిని విద్యార్థులకు ముగ్గుల పోటీలు నిర్వహించడం జరిగింది ఈ పోటీలలో సుమారుగా 80 మంది విద్యార్థులు పాల్గొన్నారు సీనియర్ జూనియర్ సబ్ జూనియర్ కేటగిరిగా పోటీల నిర్వహించ బడ్డాయి ఈ పోటీలలో ప్రథమ ద్వితీయ తృతీయ స్థానాల్లో వచ్చిన విద్యార్థులకు స్థానిక స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మేనేజర్ జులియానా గారు మరియు క్యాషియర్ శ్వేత గారు బహుమతులను అందజేసి విద్యార్థిని విద్యార్థులకు సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తూ విద్యార్థులకు క్రమశిక్షణ మరియు విధేయత ప్రాధాన్యతని తెలియజేశారు ఈ కార్యక్రమంలో పాఠశాల చైర్ పర్సన్ శ్రీమతి ఉష రాణి గారు ప్రిన్సిపల్ అరవపల్లి శంకర్ గారు ఏవో ఆర్ ప్రభాకర్ రెడ్డి గారు మరియు ఉపాధ్యాయ బృందం పాల్గొన్నారు