Tnrnews.in
తెలంగాణరాజకీయం

ఎమ్మెల్యే ఉత్తమ్ పద్మావతి రెడ్డికి మంత్రి పదవి ఇవ్వాలని కోదాడ కాంగ్రెస్ పార్టీ నాయకుల డిమాండ్

కోదాడ పట్టణంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో మున్సిపాలిటీ మాజీ చైర్మన్ సామినేని ప్రమీల మరియు మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్ కోటేశ్వరరావు మీడియా సమావేశం నిర్వహించారు. తెలంగాణ రాష్ట్రంలో మంత్రివర్గ విస్తరణలో భాగంగా కోదాడ ఎమ్మెల్యే ఉత్తమ్ పద్మావతి రెడ్డికి మంత్రి పదవి ఇవ్వాలని కోదాడ కాంగ్రెస్ పార్టీ నాయకుల ఆధ్వర్యంలో సమావేశం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో సామినేని ప్రమీల, కందుల కోటేశ్వరరావు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో అత్యధిక ఓట్ల మెజారిటీతో గెలుపొందిన మహిళా ఎమ్మెల్యే ఉత్తమ్ పద్మావతి రెడ్డికి మంత్రి పదవి ఇవ్వాలని ఈ సందర్భంగా డిమాండ్ చేశారు. అలాగే ఉమ్మడి నల్గొండ జిల్లాలోనే ఉన్న ఏకైక మహిళా ఎమ్మెల్యే అని అలాగే ఎటువంటి అవినీతి ఆరోపణలు లేనటువంటి ఎమ్మెల్యే ఉత్తమ్ పద్మావతి రెడ్డి అని ఈ సందర్భంగా కొనియాడారు. ఈ నేపథ్యంలో తెలంగాణ రాష్ట్రంలో మహిళలకు ప్రత్యేక స్థానం కల్పించాలని ఈ సందర్భంగా గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో గంధం యాదగిరి,పెండం వెంకటేశ్వర్లు, షాబుద్దీన్, కట్టబోయిన శ్రీనివాస్ యాదవ్, మధార్, షఫీ , సుబ్బారావు, కోటిరెడ్డి స్వామి నాయక్ తదితరులు పాల్గొన్నారు.

Save or share this story as a newspaper-style Epaper Clip:

Related posts

పెన్షనర్ల సవరణ చట్టాన్ని రద్దు చేయాలి

Harish Hs

అమ్మాపురం లో శ్రీకాంతా చారి వర్ధంతి వేడుకలు ప్రభుత్వాలు ప్రజా ఉద్యమాలను గౌరవించాలి 

TNR NEWS

సీసీ కెమెరాలను ఏర్పాటుతో నేరాలు నియంత్రణ  – సైబర్ మోసాల పట్ల అప్రమత్తంగా ఉండాలి  – బెల్ట్ షాపులు, గుడుంబా అమ్మకాలు పూర్తిస్థాయిలో నివారించాలి – వాహనాలకు ఇన్సూరెన్స్ రిజిస్ట్రేషన్ పత్రాలు కలిగి ఉండాలి – పరకాల ఏసీబీ సతీష్ 

TNR NEWS

కానిస్టేబుల్ నరేష్ పై దాడి చేసిన వారిని‌ శిక్షించాలి

Harish Hs

“గత ప్రభుత్వ కాలంలో ఒక్క రేషన్ కార్డూ ఇవ్వలేదు – గంగుల కమలాకర్‌ను అబ్దుల్ రెహమాన్ సూటిగా ప్రశ్నించారు”

TNR NEWS

మంత్రి ఉత్తమ్ తో జుక్కల్ ఎమ్మెల్యే తోట భేటీ

TNR NEWS