Tnrnews.in Telugu News App | Daily Telugu News Channel In Suryapeta Telangana
తెలంగాణ

స్వర్ణ భారతి ట్రస్ట్ ఆధ్వర్యంలో మజ్జిగ పంపిణీ

కోదాడ స్వర్ణ భారతి ట్రస్ట్ చేస్తున్న సేవలు అభినందనీయమని కోదాడ తహసిల్దార్ వాజిద్ అన్నారు. గురువారం పట్టణంలోని స్థానిక రంగా థియేటర్ చౌరస్తాలో ఏర్పాటుచేసిన హైటెక్ చలివేంద్రం వద్ద దాతలు పందిరి సత్యనారాయణ, షర్మిల 31వ వివాహ వార్షికోత్సవం సందర్భంగా వారి సహకారంతో మండుటెండలో వెళ్లే పాదచారులకు చల్లటి మజ్జిగను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వేసవిలో ప్రజలు దాహార్తిని తీర్చేందుకు చలివేంద్రం ఏర్పాటు చేయడంతో పాటు దాతలు ముందుకు వచ్చి చేయూతనందించడం అభినందనీయం అన్నారు. ఈ కార్యక్రమంలో గరినే శ్రీధర్, ట్రస్ట్ ప్రధాన కార్యదర్శి చారుగండ్ల రాజశేఖర్, కార్యనిర్వాహక అధ్యక్షులు ఓరుగంటి కిట్టు, ఉపాధ్యక్షులు యాద సుధాకర్, సభ్యులు గుడు గుంట్ల సాయి, వెంకటరమణ, సుధాకర్, శ్రీనివాసరావు, హైమావతి, రంగారావు, సురేందర్, రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు……….

Related posts

న్యాయమూర్తి పై దాడి హేయమైన చర్య

Harish Hs

భీమా రంగంలో విదేశీ పెట్టుబడులను వ్యతిరేకించండి

Harish Hs

రాష్ట్రస్థాయి పోటీలకు మోడల్ స్కూల్ విద్యార్థులు

TNR NEWS

కందుల కొనుగోలు కేంద్రంను ప్రారంభించిన ఎమ్మెల్యే పల్లా వ్యవసాయానికి కేసీఆర్ చేసినంత సేవ దేశ చరిత్రలో ఎవరూ చేయలేదు రైతన్నల హామీలు ఇవ్వకపోతే అన్నదాతలతో కలిసి కొట్లాడుతాం అవినీతి రహితంగా కొనుగోలు కేంద్రాన్ని చేపట్టాలి జనగామ ఎమ్మెల్యే డాక్టర్ పల్లా రాజేశ్వర్ రెడ్డి

TNR NEWS

పొగ మంచు కారణంగా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న వాహనదారులు

Harish Hs

సైబర్‌నేరాల పట్ల అప్రమత్తంగా ఉండాలి

TNR NEWS