భూ సమస్యల సత్వర పరిష్కారమే ప్రభుత్వ ద్వేయమని,
భూ భారతి చట్టం రైతుల భూ సమస్యల శాశ్వత పరిష్కారానికే అని కోదాడ ఆర్డీవో సూర్యనారాయణ అన్నారు. గురువారం మునగాల మండలం ఎస్ఎం పేట గ్రామంలో నిర్వహించిన భూభారతి రెవెన్యూ సదస్సులో ఆయన పాల్గొని రైతుల వద్ద నుంచి దరఖాస్తులు స్వీకరించి మాట్లాడారు.రైతులు తమ సమస్యలను దరఖాస్తుల్లో స్పష్టంగా తెలియజేయాలన్నారు. దరఖాస్తుల్లో రైతులు వ్యక్తం చేసిన సమస్యలను క్షేత్రస్థాయిలో పరిశీలించి పరిష్కరిస్తామన్నారు. ఈ రెవెన్యూ సదస్సులో 111 మంది రైతులు దరఖాస్తులు అందజేశారన్నారు.
Save or share this story as a newspaper-style Epaper Clip:
