Tnrnews.in Telugu News App | Daily Telugu News Channel In Suryapeta Telangana
తెలంగాణ

చట్టాలపై ప్రతి పౌరుడు కనీస అవగాహన కలిగి ఉండాలి

పదే పదే నేరాలకు పాల్పడే వ్యక్తులపై పీడీ చట్టంలో భాగంగా కేసులు నమోదు చేస్తామని సూర్యాపేట జిల్లా ఎస్పీ నరసింహ అన్నారు. ఆయన శుక్రవారం కోదాడ పట్టణంలోని పబ్లిక్ క్లబ్ లో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు.పలు నేరాల్లో నిందితులకు అవగాహన కల్పించారు. అన్ని మతాల పండుగలను అన్ని మతాల వారు గౌరవించాలని అన్నారు. నేరాలకు పాల్పడుతున్న వ్యక్తులకు మొదటగా కౌన్సెలింగ్ ఇస్తామని, కాని వారిలో మార్పు రాకపోతే చట్టపరంగా తీవ్రమైన చర్యలు తీసుకుంటామని అన్నారు. చట్టాలపై ప్రతి పౌరుడు కనీస అవగాహన కలిగి ఉండాలని అన్నారు.

 

సమాజంలో అన్ని వర్గాల ప్రజలకు భద్రత కల్పించి, వారిలో పోలీస్ శాఖపై నమ్మకం కలిగించాలని ఈ సందర్భంగా ఎస్పీ పోలీస్ సిబ్బందికి ఉద్బోదించారు. గంజాయి అసాఘిక కార్యకలాపాలు పూర్తిగానిర్మించాలన్నారు .పట్టణంలో పలు కేసుల్లో నేరస్తులుగా ఉన్న వారికి నేరాలపై అవగాహన కల్పించారు. శాంతిభద్రతలకు విఘాతం కలిగించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. ప్రతి ఒక్కరూ సత్ప్రవర్తన కలిగి ఉండాలని సూచించారు. పోలీసులు అధికారులు తప్పుడు మార్గం నేర్చుకుంటే వారిపై కూడా కఠినచర్యలుఉంటాయన్నారు. ఈ కార్యక్రమంలో డిఎస్పి శ్రీధర్ రెడ్డి, కోదాడ టౌన్ సీఐ శివశంకర్, రూరల్ సీఐ ప్రతాప్ లింగం, మునగాల సీఐ రామకృష్ణారెడ్డి, హుజూర్నగర్ సిఐ చరమందరాజు, సబ్ డివిజన్ ఎస్ఐలు, పోలీస్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

Related posts

సిపిఎం సీనియర్ నాయకులుమరిపెల్లి వెంకన్న ను పరామర్శిన   సిపిఎం పార్టీ వాణిజ్య భవన్ శాఖ కార్యదర్శి బొమ్మిడి లక్ష్మీనారాయణ

TNR NEWS

అర్హులైన పేదలందరికీ డబల్ బెడ్ రూమ్ ఇవ్వాలి. అండర్ గ్రౌండ్ డ్రైనేజీ పేరుతో తీసిన గుంతలను వెంటనే పూడ్చాలి కొత్త రోడ్లు వేయాలి సిపిఎం 

TNR NEWS

ఆర్టీసీ బస్సులో పొగలు

TNR NEWS

గజ్వేల్ ఔటర్ రింగురోడ్డు వద్ద ఘోర రోడ్డు ప్రమాదం

TNR NEWS

ముత్యాలమ్మ పండుగకు హాజరుకావాలని ఎమ్మెల్యేను ఆహ్వానించిన ఎర్నేని

Harish Hs

పదవ తరగతి విద్యార్థులకు పరీక్ష విధానం గురించి అవగాహన – జిఎంఆర్ విద్యాసంస్థల రెస్పాండెంట్ వంటేరు గోపాల్ రెడ్డి

TNR NEWS