Tnrnews.in
తెలంగాణ

జర్నలిస్టులకు ప్రభుత్వం ఇళ్ల స్థలాలు మంజూరు చేయాలి

రాష్ట్ర ప్రభుత్వం జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు వెంటనే మంజూరు చేయాలని తెలంగాణ రాష్ట్ర వర్కింగ్ జర్నలిస్టు యూనియన్ (టియు డబ్ల్యూజే,ఐజేయు ) *జిల్లా అధ్యక్షులు కోల నాగేశ్వరరావు, ప్రెస్ క్లబ్ జిల్లా అధ్యక్షులు గింజల* *అప్పిరెడ్డి* కోరారు. సోమవారం సూర్యాపేట జిల్లా కోదాడ పట్టణంలో టియుడబ్ల్యూజె యూనియన్ డైరీని ఆవిష్కరించి మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వం అర్హత కలిగిన జర్నలిస్టుల అందరికీ ఇండ్లు స్థలాలు మంజూరు చేయాలన్నారు. జర్నలిస్టులకు ఇందిరమ్మ ఇండ్ల మంజూరు లో అవకాశం కల్పించాలన్నారు. ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలును వర్తింపజేయాలని కోరారు. ప్రభుత్వం హెల్త్ కార్డులు సక్రమంగా అమలయ్యేలా చూడాలన్నారు. కార్పొరేట్ వైద్యశాలలో హెల్త్ కార్డులకు సరైన వైద్య సదుపాయం కల్పించడంలో అధికారులు విఫలమైనారని అన్నారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ ఉద్యమకారుడు రాయపూడి చిన్ని, టి యు డబ్ల్యూ జే యూనియన్ దాడుల నిరోధక కమిటీ జిల్లా అధ్యక్షులు బాదే రాము, జిల్లా ఉపాధ్యక్షులు ఆవుల మల్లికార్జున రావు, కోట రాంబాబు, సతీష్ కుమార్, అలుగుబెల్లి హరినాథ్, పాల్గొన్నారు.

Save or share this story as a newspaper-style Epaper Clip:

Related posts

భూ సమస్యల సత్వర పరిష్కారమే లక్ష్యం

Harish Hs

ప్రభుత్వ ఉపాధ్యాయుని గొంతుకు చుట్టుకొని కోసుకొని పోయినా చైనా మాంజా

Harish Hs

*తెలంగాణ ఉద్యమకారులకు ప్రశంస పత్రాల పంపిణీ*

TNR NEWS

జీవీకే ఫ్యామిలీ హోటల్& రెస్టారెంట్ ను ప్రారంభించిన ఎమ్మెల్యే పద్మావతి రెడ్డి

Harish Hs

పట్టణ భూమిలేని నిరుపేదలందరికీ ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకాన్ని వర్తింప చేయాలి.  సిపిఎం జిల్లా కమిటీ సభ్యులు ఎల్గూరి గోవిందు, సిపిఎం వన్ టౌన్ కార్యదర్శి వల్లపు దాసు సాయికుమార్

TNR NEWS

రోడ్డు ప్రమాదంలో ఆలమూరు ఎస్సై మృతి

TNR NEWS