పూర్వ విద్యార్థులు సేవా గుణం అలవర్చుకొని సమాజంలో నిరుపేద విద్యార్థులకు తమ వంతు సహాయ సహకారాలు అందించాలని ఆనాటి గురువులు తమ పూర్వ విద్యార్థులకు పిలుపునిచ్చారు. సూర్యాపేట మండల పరిధిలోని ఎడ్లపల్లి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల 2002- 03 పదో తరగతి విద్యార్థుల పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనాన్ని ఆదివార సూర్యపేట జిల్లా కేంద్రంలోని బాలాజీ గ్రాండ్ హోటల్లో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా స్నేహితులు ఆనాటి జ్ఞాపకాలు పంచుకొని ఒకరినొకరు ఆప్యాయంగా పలకరించుకొని పొద్దంతా ఆడి పాడి సందడి చేశారు. ఈ సందర్భంగా పలువురు పూర్వ విద్యార్థులు మాట్లాడుతూ నాటి గురువులు మాకు బోధించిన విలువలు సమాజంలో మాకు ఎంతో ఉపయోగపడుతున్నాయి అన్నారు. నేడు గురువులు సూచించినట్లుగా పూర్వ విద్యార్థులుగా తాము ఒక ఫౌండేషన్ ఏర్పాటు చేసి నిరుపేద విద్యార్థులకు సహాయ సహకారాలు అందించేందుకు కృషి చేస్తామన్నారు. అనంతరం నాడు తమకు చదువు చెప్పి న గురువులు కే వెంకట్ రెడ్డి, మాధవరెడ్డి, సుదర్శన్ రెడ్డి, కృష్ణమూర్తి, రేణుక లను పూలమాలలు శాలువాలు మేమెంటోలతో ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళన ఆర్గనైజర్స్ దాసరి సైదులు, కొలిశెట్టి రమేష్ పాలడుగు శైలజ, జానకి, సంగు మహేష్, తూడి నగేష్, పాపయ్య, నరసింహారావు, ఎండ్లపల్లి, రామారం పూర్వ విద్యార్థులు పాల్గొన్నారు.
previous post
