Tnrnews.in Telugu News App | Daily Telugu News Channel In Suryapeta Telangana
తెలంగాణ

ప్రమాదవశాత్తు విద్యుత్ షాక్ తగిలి వ్యక్తి మృతి

గజ్వేల్ పట్టణంలో ప్రమాదవశాత్తు విద్యుత్ షాక్ తగిలి వరజిత్ అనే వ్యక్తి మృతి చెందాడు.. మృతుడు స్వస్థలం కర్ణాటక రాష్ట్రం లోని బీదర్ జిల్లా తొండి చౌడి గ్రామం, బతుకుదెరువు కోసం గజ్వేల్ పట్టణానికి 12 సంవత్సరాల క్రితం వచ్చాడు, మృతునికి భార్య ,ఇద్దరు చిన్న పిల్లలు ఉన్నారు. విషయం తెలుసుకున్న విద్యుత్ అధికారులు మృతదేహాన్ని పరిశీలించి మృతుని కుటుంబాన్ని పరామర్శించి పై అధికారుల దృష్టికి తీసుకెళ్లి వారి కుటుంబానికి న్యాయం జరిగేలా చూస్తామని తెలిపారు. పలువురు రాజకీయ నాయకులు మృతుని కుటుంబాన్ని పరామర్శించి వారు మాట్లాడుతూ వరజిత్ అనే చిరు వ్యాపారి గప్ చుప్ నడుపుతూ కుటుంబాన్ని పోషించుకునేవాడు. విద్యుత్ షాక్ తో మృతి చెందడం వల్ల వారి కుటుంబం చెల్లాచెదురయింది. మృతుని కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలని వారికి పది లక్షల రూపాయలు చెల్లించే విధంగా కృషి చేస్తామని తెలిపారు. విద్యుత్ అధికారులు కూడా వారి కుటుంబాన్ని ఆదుకోవాలని కోరారు.

Related posts

బిఆర్ఎస్ నాయకులు కాంగ్రెస్ నాయకుల పై వ్యక్తిగత ఆరోపణలు చేస్తే ఊరుకునేది లేదు  కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు ఎల్ల బాల్ రెడ్డి

TNR NEWS

20 నుంచి సర్వే వివరాల నమోదు..!! డేటా ఎంట్రీ ఆపరేటర్లకు మాస్టర్‌ ట్రైనింగ్‌ పూర్తి రాష్ట్ర వ్యాప్తంగా 20 వేల మందికి పైగా ఆపరేటర్లు

TNR NEWS

TNR NEWS

తెలంగాణలో ఇవాళ్టి నుంచి డిగ్రీ, పీజీ కాలేజీలు బంద్‌ !

TNR NEWS

మెద్వాన్ స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో ఉచిత మెడికల్ క్యాంపు

TNR NEWS

ఎంపీ ప్రియాంక గాంధీకి క్షమాపణ చెప్పాలి యూత్ కాంగ్రెస్ మండల అధ్యక్షులు ఉమ్మడి రవి

TNR NEWS