Tnrnews.in Telugu News App | Daily Telugu News Channel In Suryapeta Telangana
తెలంగాణ

ప్రమాదవశాత్తు విద్యుత్ షాక్ తగిలి వ్యక్తి మృతి

గజ్వేల్ పట్టణంలో ప్రమాదవశాత్తు విద్యుత్ షాక్ తగిలి వరజిత్ అనే వ్యక్తి మృతి చెందాడు.. మృతుడు స్వస్థలం కర్ణాటక రాష్ట్రం లోని బీదర్ జిల్లా తొండి చౌడి గ్రామం, బతుకుదెరువు కోసం గజ్వేల్ పట్టణానికి 12 సంవత్సరాల క్రితం వచ్చాడు, మృతునికి భార్య ,ఇద్దరు చిన్న పిల్లలు ఉన్నారు. విషయం తెలుసుకున్న విద్యుత్ అధికారులు మృతదేహాన్ని పరిశీలించి మృతుని కుటుంబాన్ని పరామర్శించి పై అధికారుల దృష్టికి తీసుకెళ్లి వారి కుటుంబానికి న్యాయం జరిగేలా చూస్తామని తెలిపారు. పలువురు రాజకీయ నాయకులు మృతుని కుటుంబాన్ని పరామర్శించి వారు మాట్లాడుతూ వరజిత్ అనే చిరు వ్యాపారి గప్ చుప్ నడుపుతూ కుటుంబాన్ని పోషించుకునేవాడు. విద్యుత్ షాక్ తో మృతి చెందడం వల్ల వారి కుటుంబం చెల్లాచెదురయింది. మృతుని కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలని వారికి పది లక్షల రూపాయలు చెల్లించే విధంగా కృషి చేస్తామని తెలిపారు. విద్యుత్ అధికారులు కూడా వారి కుటుంబాన్ని ఆదుకోవాలని కోరారు.

Related posts

విద్యార్థులకు నాణ్యమైన భోజనాన్ని అందించాలి

Harish Hs

వినూత్నంగా రోడ్డు భద్రత నియమాలపై అవగాహన

Harish Hs

పలు కుటుంబాలను పరామర్శించిన సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యురాలు మల్లు లక్ష్మి

TNR NEWS

ఆత్మీయ బహుజన పలకరింపు యాది సభ స్వర్గీయ డాక్టర్ భీమగాని లక్ష్మీనారాయణ సంతాప సభ

TNR NEWS

*మంథనిలో పోలీసుల కార్డెన్ సర్చ్*  సరైన ధ్రువీకరణ పత్రాలు లేని సుమారు 50 ద్విచక్ర వాహనాలు, రెండు ఆటోలను గుర్తించిన పోలీసులు.

TNR NEWS

అర్హులైన పేదలందరికీ ఇండ్లు ఇళ్ల స్థలాలు ఇవ్వాలి.  ఐద్వా జిల్లా ప్రధాన కార్యదర్శి మద్దెల జ్యోతి 

TNR NEWS