Tnrnews.in Telugu News App | Daily Telugu News Channel In Suryapeta Telangana
తెలంగాణ

ప్రమాదవశాత్తు విద్యుత్ షాక్ తగిలి వ్యక్తి మృతి

గజ్వేల్ పట్టణంలో ప్రమాదవశాత్తు విద్యుత్ షాక్ తగిలి వరజిత్ అనే వ్యక్తి మృతి చెందాడు.. మృతుడు స్వస్థలం కర్ణాటక రాష్ట్రం లోని బీదర్ జిల్లా తొండి చౌడి గ్రామం, బతుకుదెరువు కోసం గజ్వేల్ పట్టణానికి 12 సంవత్సరాల క్రితం వచ్చాడు, మృతునికి భార్య ,ఇద్దరు చిన్న పిల్లలు ఉన్నారు. విషయం తెలుసుకున్న విద్యుత్ అధికారులు మృతదేహాన్ని పరిశీలించి మృతుని కుటుంబాన్ని పరామర్శించి పై అధికారుల దృష్టికి తీసుకెళ్లి వారి కుటుంబానికి న్యాయం జరిగేలా చూస్తామని తెలిపారు. పలువురు రాజకీయ నాయకులు మృతుని కుటుంబాన్ని పరామర్శించి వారు మాట్లాడుతూ వరజిత్ అనే చిరు వ్యాపారి గప్ చుప్ నడుపుతూ కుటుంబాన్ని పోషించుకునేవాడు. విద్యుత్ షాక్ తో మృతి చెందడం వల్ల వారి కుటుంబం చెల్లాచెదురయింది. మృతుని కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలని వారికి పది లక్షల రూపాయలు చెల్లించే విధంగా కృషి చేస్తామని తెలిపారు. విద్యుత్ అధికారులు కూడా వారి కుటుంబాన్ని ఆదుకోవాలని కోరారు.

Related posts

మీడియా సమాజానికి అద్దం లాంటిదని జిల్లా కలెక్టర్ :ఇలా త్రిపాఠి

TNR NEWS

ఎన్నాళ్లో వేచిన ఉద్యోగం నెల రోజులు అయినా నిలవని ఆనందం

TNR NEWS

మండల రైతాంగానికి పోలీసువారి విజ్ఞప్తి ధాన్యం సేకరణ ,ఆరబెట్టడం, అమ్మకాలలో నిర్లక్ష్యం వహిస్తే ప్రమాదం పొంచి ఉంది రైతులు, ట్రాక్టర్ డ్రైవర్ల జాగ్రత్త వహించాలి . మునగాల ఎస్సై ప్రవీణ్ కుమార్

TNR NEWS

కోదాడ మాతా నగర్ లో ఘనంగా సెమి క్రిస్మస్ వేడుకలు……..

TNR NEWS

మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డిని రైతులను వెంటనే విడుదల చేయాలి బిఆర్ఎస్ పార్టీ మహిళా నాయకురాలు కుర్ర సావిత్రి

TNR NEWS

రేపు తెలంగాణ బంద్‌కి పిలుపునిచ్చిన తీన్మార్ మల్లన్న

TNR NEWS