కామారెడ్డి జిల్లా జుక్కల్ నియోజకవర్గం మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో రాష్ట్ర నీటి పారుదల, పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్కుమార్ రెడ్డి సోమవారం నాందేడ్ చేరుకున్నారు. ఈ మేరకు జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీ కాంతారావు మంత్రిని కలిసి భేటీ అయ్యారు. మహారాష్ట్ర సరిహద్దులోని లెండి ప్రాజెక్ట్ పనులు త్వరగా పూర్తి చేయాలని, దీంతో జుక్కల్ నియోజకవర్గంలోని మద్నూర్, జుక్కల్, బిచ్కుంద మండలాల్లో దాదాపు 26వేల ఎకరాలకుసాగునీరందుతుందని మంత్రికి వివరించారు. దీంతో మంత్రి సానుకూలంగా స్పందించినట్లు ఎమ్మెల్యే తెలిపారు.