సిద్దిపేట జిల్లా గజ్వేల్ గీతాంజలి పాఠశాల లో 9వ తరగతి చదువుతున్న జోయల్ శ్యామ్ జాతీయ స్థాయి క్రీడకు ఎంపిక కావడం జరిగింది. ఇటీవల నాగోల్ లో జరిగిన సెపక్ తక్రా అండర్ 19 టోర్నమెంట్లో అత్యున్నత ప్రదర్శన ప్రదర్శించి జాతీయస్థాయిలోఎంపిక కావడం జరిగింది. ఈ సందర్భంగా పిఈటీ శివరంజని మాట్లాడుతూ జోయల్ శ్యామ్ సెపక్ తక్రా క్రీడలో ప్రతిభ కనబరిచి జాతీయస్థాయి క్రీడలకు ఎంపిక కావడం సంతోషంగా ఉందన్నారు. ప్రతి ఒక్క విద్యార్థి ఏదో ఒక క్రీడలో రాణించి దేశానికి వారి తల్లిదండ్రులకు మంచి పేరు తేవాలని, క్రీడల వల్ల మానసిక ఉల్లాసం తో పాటు ఆరోగ్యాన్ని పరిరక్షించుకోవచ్చని అన్నారు.
Save or share this story as a newspaper-style Epaper Clip:
