Tnrnews.in Telugu News App | Daily Telugu News Channel In Suryapeta Telangana
తెలంగాణ

ప్రజావాణి దరఖాస్తులను పరిష్కారించాలి …. అదనపు కలెక్టర్ డి.వేణు

ప్రజావాణిలో వచ్చిన దరఖాస్తులను పరిష్కరించాలని అదనపు కలెక్టర్ డి.వేణు సంబంధిత అధికారులకు తెలిపారు. సోమవారం ప్రజావాణి సందర్భంగా సమీకృత జిల్లా కలెక్టరేట్ లో అదనపు కలెక్టర్ డి.వేణు ప్రజల దరఖాస్తులను స్వీకరించారు.మంథని పట్టణానికి చెందిన ఏ. శంకర్ గౌడ్ మంథని గీత పారిశ్రామిక సహకార సంఘం పరిధిలోని కే.శంకర్ గౌడ్ అనుమతి లేకుండా ఈత తాటి చెట్లను గీస్తున్నారని, ఇతనిపై ఫిర్యాదు చేసినప్పటికీ సీఐ అధికారి ఎటువంటి చర్యలు తీసుకోలేదని, సంబంధిత అధికారిపై విచారణ చేసి తగు చర్యలు తీసుకుని గీత కార్మికులు న్యాయం చేయాలని కోరుతూ దరఖాస్తు చేసుకోగా జిల్లా అబ్కారీ శాఖ అధికారి రాస్తూ అవసరమైన చర్యలు తీసుకోవాలని అదనపు కలెక్టర్ తెలిపారు.రామగుండం 6వ డివిజన్ కు చెందిన ఎం.లక్ష్మన్ వృద్దాప్య పెన్షన్ మంజూరు చేయాలని కోరుతూ దరఖాస్తు చేసుకోగా జిల్లా గ్రామీణ అభివృద్ధి అధికారి రాస్తూ అవసరమైన చర్యలు తీసుకోవాలని అదనపు కలెక్టర్ తెలిపారు.

ధర్మారం మండలం కొత్తపల్లి గ్రామానికి చెందిన బి.సంతోష్ నాయక్ తనకు కార్పొరేషన్ ద్వారా టీ స్టాల్ మంజూరు చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారని, నాయందు దయ తలిచి దానికి సంబంధించిన డబ్బులు త్వరగా వచ్చేటట్లు చేయాలని కోరుతూ దరఖాస్తు చేసుకోగా జిల్లా గిరిజన అభివృద్ధి అధికారికి రాస్తూ విచారించి వెంటనే చర్యలు చేపట్టాలని అదుపు కలెక్టర్ పేర్కొన్నారు.ఈ ప్రజావాణి కార్యక్రమంలో జిల్లా అధికారులు, తదితరులు పాల్గొన్నారు.

Related posts

నేడు మోతే మండలంలో ఎమ్మెల్యే పర్యటన

Harish Hs

విద్యార్థులు నూతన సాంకేతికతను అందిపుచ్చుకోవాలి

Harish Hs

ఆపదలో అండగా సీఎంఆర్ఎఫ్ చెక్కులు  కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు ఏళ్ల బాల్ రెడ్డి

TNR NEWS

విద్యాశాఖ మంత్రిని కేటాయించకపోవడం ప్రభుత్వ నిర్లక్ష్యానికి నిదర్శనం  బహుజన సమాజ్ పార్టీ జిల్లా కోశాధికారి కత్తి నాగబాబు

TNR NEWS

ప్రజా పాలనలో పేదలకు ఇందిరమ్మ ఇండ్లు ఇవ్వరా? పేదలకు ఎన్నికల హామీలు అమలు చేయకపోతే ఉధృత పోరాటాలు తప్పవు రాష్ట్ర ప్రభుత్వం భూభారతి చట్టాన్ని వెంటనే అమలు చేయాలి. సిపిఎం జిల్లా కార్యదర్శి మల్లు నాగార్జున రెడ్డి

TNR NEWS

జులై 7న జరిగే ఎమ్మార్పీఎస్ 31వఆవిర్భావ దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించాలి

TNR NEWS