Tnrnews.in
తెలంగాణ

ప్రజావాణి దరఖాస్తులను పరిష్కారించాలి …. అదనపు కలెక్టర్ డి.వేణు

ప్రజావాణిలో వచ్చిన దరఖాస్తులను పరిష్కరించాలని అదనపు కలెక్టర్ డి.వేణు సంబంధిత అధికారులకు తెలిపారు. సోమవారం ప్రజావాణి సందర్భంగా సమీకృత జిల్లా కలెక్టరేట్ లో అదనపు కలెక్టర్ డి.వేణు ప్రజల దరఖాస్తులను స్వీకరించారు.మంథని పట్టణానికి చెందిన ఏ. శంకర్ గౌడ్ మంథని గీత పారిశ్రామిక సహకార సంఘం పరిధిలోని కే.శంకర్ గౌడ్ అనుమతి లేకుండా ఈత తాటి చెట్లను గీస్తున్నారని, ఇతనిపై ఫిర్యాదు చేసినప్పటికీ సీఐ అధికారి ఎటువంటి చర్యలు తీసుకోలేదని, సంబంధిత అధికారిపై విచారణ చేసి తగు చర్యలు తీసుకుని గీత కార్మికులు న్యాయం చేయాలని కోరుతూ దరఖాస్తు చేసుకోగా జిల్లా అబ్కారీ శాఖ అధికారి రాస్తూ అవసరమైన చర్యలు తీసుకోవాలని అదనపు కలెక్టర్ తెలిపారు.రామగుండం 6వ డివిజన్ కు చెందిన ఎం.లక్ష్మన్ వృద్దాప్య పెన్షన్ మంజూరు చేయాలని కోరుతూ దరఖాస్తు చేసుకోగా జిల్లా గ్రామీణ అభివృద్ధి అధికారి రాస్తూ అవసరమైన చర్యలు తీసుకోవాలని అదనపు కలెక్టర్ తెలిపారు.

ధర్మారం మండలం కొత్తపల్లి గ్రామానికి చెందిన బి.సంతోష్ నాయక్ తనకు కార్పొరేషన్ ద్వారా టీ స్టాల్ మంజూరు చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారని, నాయందు దయ తలిచి దానికి సంబంధించిన డబ్బులు త్వరగా వచ్చేటట్లు చేయాలని కోరుతూ దరఖాస్తు చేసుకోగా జిల్లా గిరిజన అభివృద్ధి అధికారికి రాస్తూ విచారించి వెంటనే చర్యలు చేపట్టాలని అదుపు కలెక్టర్ పేర్కొన్నారు.ఈ ప్రజావాణి కార్యక్రమంలో జిల్లా అధికారులు, తదితరులు పాల్గొన్నారు.

Save or share this story as a newspaper-style Epaper Clip:

Related posts

యూత్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో ఘనంగా రాహుల్ గాంధీ జన్మదిన వేడుకలు

Harish Hs

దివ్యాంగులకు రైల్వే భారీ ఊరట.. UDID కార్డుతో టికెట్ ధరపై 75% వరకు రాయితీ

TNR NEWS

పాఠశాల వార్డెన్ పై ఆగ్రహం వ్యక్తం చేసిన వరంగల్ జిల్లా కలెక్టర్

TNR NEWS

అమ్మాపురం లో శ్రీకాంతా చారి వర్ధంతి వేడుకలు ప్రభుత్వాలు ప్రజా ఉద్యమాలను గౌరవించాలి 

TNR NEWS

రామానంద తీర్థ చైర్మన్ ను సన్మానించిన ఓయూ పూర్వ విద్యార్థులు 

TNR NEWS

గ్రామ సభలను ఖచ్చితంగా షెడ్యుల్ ప్రకారం నిర్వహించాలి. గ్రామ సభలకు విస్తృత ఏర్పాట్లు చేయాలి,   జిల్లా కలెక్టర్ ప్రతిక్ జైన్ 

TNR NEWS