Tnrnews.in
తెలంగాణ

సావిత్రీబాయి ఫూలే సేవలు మరువలేనివి

భారత దేశ మొదటి మహిళా ఉపాధ్యాయురాలు, సావిత్రిబాయి ఫూలే సేవలు మరువలేనివని తడ్కల్ క్లస్టర్ ఎమ్మార్పీఎస్ అధ్యక్షులు లాల్ కుమార్ మాదిగ అన్నారు.ఎమ్మార్పీఎస్ కమిటీ ఆధ్వర్యంలో శుక్రవారం సావిత్రి బాయి ఫూలే ఆమె 194వ జయంతిని ఘనంగా నిర్వహించారు.సావిత్రీబాయి చిత్రపటానికి పూల మాలలు వేసి నివాళులర్పించారు.అనంతరం తడ్కల్ క్లస్టర్ ఎమ్మార్పీఎస్ అధ్యక్షులు లాల్ కుమార్ మాదిగ మాట్లాడుతు….సంఘ సంస్కర్త, ఉపాధ్యాయిని,రచయిత్రి,ఆమె నిమ్న వర్గాల అభ్యున్నతికి కృషి చేసిన జ్యోతీరావ్ ఫూలే భార్య. కులమత భేదాలకు అతీతంగా సమాజాన్ని ప్రేమించిన ప్రేమస్వరూపిణి.ఆధునిక విద్య ద్వారానే స్త్రీ విముక్తి సాధ్యపడుతుందని నమ్మిన ఆమె, తన భర్తతో కలసి 1848 జనవరి 1న పూణేలో మొట్టమొదటగా బాలికల పాఠశాలను ప్రారంభించింది,కుల వ్యవస్థకు, పితృస్వామ్యానికి వ్యతిరేకంగా,శూద్రుల, అస్పృశ్యుల,మహిళల సకల హక్కుల కోసం పోరాటం చేయటం తమ సామాజిక బాధ్యతగా ఆ దంపతులు విశ్వసించారు.నూతన వ్యవస్థ కోసం, ప్రాణాల్ని సైతం పణంగా పెట్టి సమష్టిగా పోరాటం చేసింది.సమాజంలోని కులతత్వం,పురుషాధిక్య ధోరణులు కలిగిన చాలామంది పండిత మేధావులందరికీ కూడా ఆమె కేవలం జ్యోతిరావు ఫూలే భార్యగా మాత్రమే తెలుసు.కానీ ఆమె ఆధునిక భారతదేశంలో మొట్టమొదటి మహిళా ఉపాధ్యాయురాలు,పీడిత ప్రజలు ముఖ్యంగా స్త్రీల విద్యాభివృద్ధికి కృషి చేసిన తొలితరం మహిళా ఉద్యమకారిణి అని అన్నారు,ఈ కార్యక్రమంలో రమేష్ గౌడ్, మాణిక్ మాదిగ,తదితరులు పాల్గొన్నారు.

Save or share this story as a newspaper-style Epaper Clip:

Related posts

కంగ్టిలో పడకేసిన పారిశుద్ధ్యం పారిశుద్యం పై అధికారుల నిర్లక్ష్యం పట్టించుకోని ఆఫీసర్లు

TNR NEWS

ఎస్బీఐ ఆధ్వర్యంలో మెగా బ్లడ్ డొనేషన్ క్యాంప్  తలసేమియా బాధితులకు అండగా ఎస్బీఐ ఉద్యోగులు

TNR NEWS

వరిలో అగ్గి తెగులు నివారణ చర్యలు పాటించాలి

Harish Hs

అర్హులైన పేదలందరికీ ఇండ్లు ఇళ్ల స్థలాలు ఇవ్వాలి.  ఐద్వా జిల్లా ప్రధాన కార్యదర్శి మద్దెల జ్యోతి 

TNR NEWS

ఇసుక అక్రమ రవాణాకు అడ్డుకట్ట   వాగులోకి ట్రాక్టర్లు వెళ్లకుండా కందకం తీసిన పోలీసులు

TNR NEWS

దాడుల సంస్కృతిని ఖండిస్తున్నాం. _మద్నూర్ మండల తహసీల్దార్ ఎం డి ముజీబ్

TNR NEWS