Tnrnews.in
తెలంగాణ

మదర్ థెరిసా యూత్ ఆధ్వర్యంలో ఘనంగా అన్నదాన కార్యక్రమం

గణేష్ నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా భక్తులకు కోదాడ పట్టణంలోని మదర్ తెరిసా యూత్ ఆధ్వర్యంలో గురువారం అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా టిపిసిసి డెలిగేట్ కోదాడ బార్ అసోసియేషన్ అధ్యక్షులు చింతకుంట్ల లక్ష్మీనారాయణ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ పట్టణ ఉపాధ్యక్షుడు ఎడవల్లి బాల్ రెడ్డి, జిల్లా ప్రెస్ క్లబ్ మాజీ అధ్యక్షులు కారింగుల అంజన్న గౌడ్ లు హాజరై వినాయకుడి వద్ద ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించి అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించారు. అనంతరం వారు మాట్లాడుతూ…భారత దేశ సంస్కృతిలో భాగంగా వినాయక చవితి సందర్భంగా వేలాదిమందికి గణేష్ మండపాల నిర్వాహకులు అన్నదాన కార్యక్రమాలను నిర్వహిస్తారన్నారు. పురాతన సంప్రదాయాలను గౌరవించడం మన బాధ్యతని గుర్తు చేశారు.అన్ని దానాల్లో కెల్లా అన్నదానం గొప్పదన్నారు. విఘ్నేశ్వరుని ఆశీస్సులతో నియోజకవర్గ ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండాలని ఆకాంక్షించారు.ఈ కార్యక్రమంలో పట్టణ ప్రముఖ పండితులు, విష్ణుబొట్లహరిప్రసాద్ శర్మ యూత్ అధ్యక్షులు చలిగంటి ప్రసాద్ బాలేబోయిన శ్రీనివాస్ చలిగంటి మురళి కొలిపాక రాజేష్ బాడిష రమేష్ సత్తార్ తో పాటు యూత్ సభ్యులు పాల్గొన్నారు.

 

Save or share this story as a newspaper-style Epaper Clip:

Related posts

నూతన రేషన్ కార్డులు,సన్న బియ్యం పంపిణీ ద్వారా పేదలకు ఆహార భద్రత

TNR NEWS

ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో సమస్యలు పరిష్కరించాలి  ధాన్యం తరరలింపులో నిర్లక్ష్యం వహించిన అధికారులపై చర్యలు తీసుకోవాలి  రైతు సంఘం రాష్ట్ర కార్యదర్శి టి సాగర్ 

TNR NEWS

శ్మశాన వాటికలు నిర్మించారు.విద్యుత్ సప్లై మరిచారు

TNR NEWS

విద్యుదాఘాతంతో రైతు మృతి

Harish Hs

వి. ఎన్. స్ఫూర్తితో పాలకుల ప్రజా వ్యతిరేక విధానాలపై పోరాడాలి.  సిపిఎం జిల్లా కార్యదర్శి మల్లు నాగార్జున రెడ్డి

TNR NEWS

కోదాడ క్లస్టర్ ఉద్వాన విస్తరణ అధికారిగా రాజు

TNR NEWS