అన్ని ఔషధాలపై 20శాతం డిస్కౌంట్ తో అందించే క్రేడాస్ సేవలను ప్రతి ఒక్కరు వినియోగించుకోవాలని క్రేడాస్ కంపెనీ సీఈవో శైలేంద్ర కుమార్ అన్నారు. సోమవారం జిల్లా కేంద్రంలోని పాత జాతీయ రహదారి (పూల సెంటర్ ప్రాంతం) లో ఇంద్రపల్లి వసంతకుమారి ఆధ్వర్యంలో నూతనంగా ఏర్పాటుచేసిన క్రెడాస్ మెడికల్ షాప్ ను ప్రారంభించి మాట్లాడారు. రాష్ట్రం తో పాటు సూర్యాపేట జిల్లా కేంద్రంలో క్రెడాస్ మెడికల్ షాప్ కు రోజుకు ఆదరణ పెరుగుతుందని ప్రస్తుతం నాలుగవ బ్రాంచ్ ను ప్రారంభించడం జరిగిందన్నారు. వినియోదారుల మనలను పొందేల క్రేడాస్ సేవలను విస్తరిస్తున్నామని స్పష్టం చేశారు. అన్ని రకాల మెడిసిన్ అందుబాటులో ఉన్నాయని తెలిపారు. కార్యక్రమంలో బొజ్జ ప్రసాద్, ఫార్మసిస్టు నవ్య, కలకోట్ల మహేష్, ప్రణయ్ ,సంతోష్ ,సాయి పాల్గొన్నారు
Save or share this story as a newspaper-style Epaper Clip:
