మహాత్మా గాంధీ వర్ధంతి సందర్భంగా గురువారం మునగాల మండల కేంద్రంలోని మహాత్మా గాంధీ విగ్రహానికి మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు కొప్పుల జయపాల్ రెడ్డి మాట్లాడుతూ.. బాపూజీ చూపిన శాంతి బాటలో ప్రతి ఒక్కరూ పయనించాలని,అహింస మార్గమే ప్రపంచశాంతికి దోహదపడతాయన్నారు.ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు.