Tnrnews.in Telugu News App | Daily Telugu News Channel In Suryapeta Telangana
ఆంధ్రప్రదేశ్

కుక్కుటేశ్వరుడి నిత్యన్నదానానికి భాస్కరనారాయణ రాజు దంపతులు విరాళం

పిఠాపురం : ప్రముఖ పుణ్యక్షేత్రంగా విరాజిల్లుతున్న పిఠాపురం పట్టణంలో వేంచేసిన శ్రీరాజరాజేశ్వరి సమేత ఉమా కుక్కుటేశ్వరస్వామి ఆలయంలో జరిగే నిత్యన్నదానానికి కాకినాడకు చెందిన కలిదిండి భాస్కరనారాయణ రాజు దంపతులు మంగళవారం విరాళం అందజేశారు. శ్రీ కుక్కుటేశ్వర స్వామి వారి దేవస్థానం నిత్యన్నదానం ట్రస్ట్‌కు ఒక లక్ష వేయ్యి నూట పదహార్లు రూపాయలు రూ.1,01,116లు శాశ్వత అన్నదాన పథకమునకు విరాళం ఇచ్చారు. ప్రతి సంవత్సరం మార్చి 3వ తేదీన అన్నదానం జరిపించవలసిందిగా వారు ఆలయ అధికారులను కోరారు. వారికి దేవస్థాన సహాయ కమిషనర్‌ మరియు కార్యనిర్వహణాధికారి కాట్నం జగన్మోహన్‌ శ్రీనివాస్‌ అన్నదాన పథకం బాండ్‌ అందజేసి, శ్రీ స్వామివారి చిత్రపటం, శేషవస్త్రాలు మరియు ప్రసాదాలను అందజేశారు.

Related posts

కాకినాడగణపతిపీఠంలో 53మంది ఉపవాసకులతో ఘనంగా జరిగిన మాఘ సంకష్టహర చతుర్థి

Dr Suneelkumar Yandra

ఎంత మంది పిల్లలున్నా ఎన్నికల్లో పోటీ చేయొచ్చు – ఏపీ పంచాయతీ సవరణ బిల్లుకు ఆమోదం..!!

TNR NEWS

త్రేతాయుగ ప్రతీక “భద్రాచల పాదయాత్ర” – 14వార్షికాలు పూర్తి చేసిన గురుస్వామి వాసుదేవ ఆచార్యను సత్కరించిన గణపతి పీఠం

Dr Suneelkumar Yandra

పిఠాపురం నియోజకవర్గంలో అభివృద్ధి పండుగ

గర్భిణీ స్త్రీలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలి

విలీన గ్రామాలకు 70% ఆర్థిక సంఘం నిధులు విడుదల చేయాలి.. లేకుంటే విలీన పెండింగ్ ప్రక్రియ పూర్తి చేసి కార్పోరేషన్ ఎన్నికలు నిర్వహించాలి

Dr Suneelkumar Yandra